సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
వర్ణిస్తా డలాటి సన్నివేశం. వర్ణించకపోడు. అయినా దానికి తాను చేయవలసిన పరిష్కార మేమిటో వెంటనే వ్యంగ్యంగా చేసి చూపుతాడు.
అదీ రెండు భంగిమలలో చేస్తాడు కాళిదాసు. ఒకటి చాలా తీవ్రమైన స్థాయి నంతకు ముందొక సందర్భ మందుకొని మన హృదయం బరువెక్కి-భరించలేని స్థితికి వస్తే - తరువాత దాని తీవ్రతను క్రమంగా తగ్గించి మన హృదయ భారం దూరంచేసి తేలిక పరుస్తాడు. చూడండి. కుమార సంభవంలో శివపార్వతుల పరస్పరాలోకనం శృంగార భావం చిగిరించే లోపలనే తపఃపరామర్శ వివృర్ధ మన్యుడైన ఆ మహాకాలుడి ఫాలనేత్రిన్రలం మన్మధుణ్ణి దారుణంగా కాల్చివేస్తుంది. స్త్రీ సన్నికర్ష ఇక పనికి రాదని పరమేశ్వరు డక్కడినుంచి అంతర్ధాన మైపోతాడు. రతి ఆవేదనతో నేల వాలుతుంది. హైమవతి తన ఆకృతినే నిందించి ఘోరమైన తపశ్చర్యకు పూనుకొంటుంది. కాగా అంత భీష్మించుకొని బిర్ర బిగిసి పోయిన ఆ ఈశ్వరుడు మరలా కుహనా బ్రహ్మచారి వేషంలో వచ్చి ఆవిడతో ఎంతో చపలంగా వ్యవహరిస్తాడు. అంతకు ముందు పెదవి విప్పి ఒక్క మాట మాటాడని వాడెన్ని మాటలో ఎన్ని ఎకసకాలో. అలాగే మదన పత్ని అంత పతి వియోగంతో చేసిన విలాపమూ తరువాత శివ పార్వతుల కళ్యాణంతో పతి పునరుజ్జీవితు డైతే ఆయనతో కలిసి ఆ దంపతుల సురత వ్యాపారంలో చరితార్థ మవుతుంది. అలాగే పతి చేత నిరాకృత అయి తపః క్లేశంతో కృశించిన ఆ దేవిని చూచి నిర్వేద పడిన మనం మరలా సప్తమహర్షుల రాయబారం ఫలించి ఆయననే చెట్టబట్టి దేదీప్యమానంగా వెలిగి పోయినట్టు కవి వర్ణిస్తుంటే సమాశ్వాసన చెందుతాము. ఇలాగే రఘువంశంలో అజుడు భార్యా వియోగంతో అలా బాధ పడుతుంటే చూడలేక పోయాడు కవి. సాదృశ్య ప్రతి కృతి దర్శనంతో పగళ్ళూ- స్వప్నంలో క్షణ కాలం సమాగమోత్సవంతో రాత్రులూ గడిచాయని చెబితేగాని ఆయన తృప్తి పడలేదు. అంతే గాదు. తేనాష్టా గమితా స్సమాః కథంచిత్. ఎంతో కష్టం మీద గడపగలిగా డదైనా ఆ
Page 234