సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆమ్రీ మంజుల మంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః జ్యా యస్యాలి కులం కలంక రహితం ఛత్రం నితాంశు: సీతం మత్తేభో మలయానిలః పరభృతో యద్వందినో లోకజిత్ సోయం వో వితరీతరీతు వితను ర్భద్రం వసంతాన్వితః
అని వసంతకాల వైభవాన్నీ సరి సమానంగా భావించి వర్ణించ గలిగాడా మహాత్ముడు. పరస్పర విలక్షణంగా కనిపించే ఋతువులలో ఒకానొక సామరస్యాన్ని గుర్తించగల సామర్థ్య మున్నదా చూడ్కికి. అంతే కాదు మామూలుగా కాలం వసంతంతో ఆరంభమయి శిశిరంతో సమాప్తం కావలసి ఉంది. కాని కవి అలా దర్శించలేదు. గ్రీష్మంతో మొదలు పెట్టి వసంతంతో ముగించాడు వర్ణన. ఏమి టాంతర్యం. దుస్సహమని భావించే కాలం నీకు నిజానికి సుఖ ప్రదమే సుమా. ఆ మాటకు వస్తే ఏదీ ఏకాంత సుఖమూ కాదు ఏకాంత దుఃఖమూ కాదు. దుఃఖంలో సుఖముంది. సుఖంలో దుఃఖముంది. రెండింటినీ ఒకదాని కొకటి ప్రతిద్వద్వి అనుకోక పోతే ప్రతి దానిలోనూ సుఖాన్నే చూరగొన వచ్చు నని కాలంమీద నెపం పెట్టి జీవన కాలమంతా సమరసంగా చూచే మానవుడి కంతా సమసుఖ దాయకమే నని ఒక మహోన్నతమైన సందేశ మందిస్తున్నాడు కవి. ఇందుమతి హఠాత్తుగా కన్నుమూస్తే సమ దుఃఖ సుఖమైన సఖీ జనమంతా ఏమై పోవాలని వాపోతా డజుడు. రతీ దేవి పతి వియోగంతో నేలమీద పడి పొరలుతుంటే సమ దుఃఖామివ కుర్వతీ స్థలీం. ఆ స్థలం కూడా ఆవిడతో పాటు శోకిస్తున్నదా అంటాడు కవి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున - సుఖంవా యదివా దుఃఖం. సుఖం గాని దుఃఖంగాని ఏదైనా ఎదటి వాడి అనుభవం నీ అనుభవంగా నీ అనుభవమే వేరొకడి అనుభవంగా చూచినపుడే పరిపూర్ణమైన సామరస్య మది. అంటే ఏ సంఘటనగానీ అనుభవిస్తున్నప్పు డెదటి వారి దృష్టి పెట్టుకొని చూడాలి కాని కేవలం నీ దృష్టినే ప్రమాణంగా తీసుకోరాదు. అది ఏకపక్ష వా దమవుతుంది. పరిపూర్ణత లేదందులో. ఇలాటి పాక్షికమైన చింతన ఎవరి విషయంలోనూ మన్నించడు కాళిదాసు.
Page 233