సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
గుహ ఆయన చేసిన ధ్వనికి ప్రతి ధ్వనించింది. ప్రతిధ్వనిస్తే అది తన ప్రశ్నకు సరి అయిన సమాధానంగా భావించా డాయన. చూడండి చమత్కారం. ఈ పద్యం ప్రశ్న అనుకొంటే ప్రశ్న సమాధాన మనుకొంటే సమాధానం. క్షితిభృత్తంటే పర్వతమూ కావచ్చు. దేశమేలే ప్రభువూ కావచ్చు. ప్రభువు క్షితిభృతాం నాథ అని సంబోధిస్తే అదీ ఆయనను క్షితిభృతాం నాథ అని పలకరించటం సబబే. పోతే మయా విరహితా త్వయా దృష్టా. నేను కోలుపోయినది నీకు కనపడిందా అని రాజు గారి మాట అయితే త్వయా విరహితా మయా దృష్టా. నీకు దూరమైనది నాకు కనిపించిందని దాని మాటగా భావించాలి ఈ వాక్యాన్ని. అలాగే భావించి భ్రాంతి పడ్డా ఉంటాడు మహాకవి.
వాస్తవమే. మానవుడెలా భావిస్తే అలాగే కనిపిస్తుందీ ప్రకృతి. భావనను బట్టే అనుభవం. వస్తు సిద్ధం కాదేదీ. బుధ్ధి సిద్ధం. బుద్ధి సవ్యంగా చూస్తే ప్రకృతి అంతా సవ్యమే మనకు. అపసవ్యంగా చూస్తే అపసవ్యమే. మేఘసందేశ మంతా ఈ సూత్రం మీదనే నడచింది. కాకపోయినా మేఘుడెవడు. యక్షుడెవడు. ఇద్దరికీ ఏమిటా అన్యోన్య వ్యవహారం. ఒక రచేతనం. ఒకరు చేతనం. కవే అన్నా డా మాటకు వస్తే. ధూమజ్యోతి స్సలిల మరుతాం సన్నిపాతః క్వ మేఘః - సందేశార్ధాః క్వ పటు కరణైః ప్రాణిభిః ప్రాపణీయాః. ప్రాణం లేని మేఘం సందేశాన్ని అందించట మేమిటి. అసలెలా సంభాషించాడు దానితో ఆ యక్షుడు. కామార్తా హి ప్రకృతి కృపణాః అని కవి సమాధానం. కామమోహితు డతడా సమయంలో. ఎవరితో ఏమి మాటాడుతున్నాడో అతనికే తెలియదు. చేతనా చేతన వివేకం లేకనే అలా వ్యవహరించాడట. అలాటి భావంతోనే సంతప్తానాం త్వమసి శరణం అని దాన్ని శరణు వేడాడు . తన అభీష్టం నెరవేర్చ గల ఉదారత కూడా అతని కుందని విశ్వసించాడు. పుష్కరావర్తక వంశంలో పుట్టిన పెద్దమనిషా మేఘు డతని పాలిటికి నిజంలో ఒక ఆపద్బాంధవుడే. యక్షుడికి మేఘుడు | మిత్రుడైతే ఆ మేఘుడి కెవరో తెలుసా వయస్యుడు. ఆ చిత్ర కూటమనే
Page 229