#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

సృష్టిలో. అంతకు ముందు పరమేశ్వరుడు తపస్సు చేస్తుంటే అకాల వసంతో దయాని కా వనమంతా పులకిస్తుంది. జంతువు లేమిటి పక్షు లేమిటి వృక్షాలేమిటి. అన్నీ కూడా అక్కడ ఉన్న ప్రమధ గణాలతో కింపురుష గంధర్వాదులతో చేతులు కలిపి శృంగార విలాసాలతో సమానంగా పాలు పంచుకొంటాయి. అమ్మవారి తపస్సుకైతే షడృతువులూ సాక్షులే. విద్యుల్లతలనే కనులు మూస్తూ తెరుస్తూ కనిపెడుతూనే ఉన్నది వర్షా లక్ష్మి ఆవిడ తపోదీక్ష. కనురెప్పల మీది నుంచి ప్రయాణం చేసి నాభి రంధ్రం చేరే వరకూ ఆ త్రిపురసుందరీ విగ్రహాన్ని సేవిస్తూనే ఉన్నాయి వర్షాగ్ర బిందువులు.

  పోతే ఇక విక్రమోర్వశీయ మేఘ సందేశాలది ఒక లోకం. భూలోక వాసి పురూరవుడేమిటి దేవలోకంలో విహరించట మేమిటి. దేవలోక వాసిని ఊర్వశి ఏమిటి. భూతలం మీది కవతరించి ఈ రాజుతో క్రీడించట మేమిటి. తుదకావిడ కుమార వనంలో ప్రవేశించి లతగా మారట మేమిటి అది గానక వెర్రి వాడయి ఆ రాజు ఈ కొండా ఆ కోనా క్రుమ్మరట మేమిటి. సృష్టినంతా పన గలిపి చూపిన ఘట్టమిది. ఈ సందర్భంలో ఆయన పలకరించని మృగం లేదు. పక్షి లేదు. పర్వతం లేదు. మేఘం లేదు. మేఘోదర వినిర్ముక్త శంపాలత లేదు. అన్నీ ఆయన సంబోధించ దగినవే. సానుభూతి చూప వలసినవే. సమస్తమూ మానవుడికి క్రీడా రంగమే ఈ ప్రకృతి. జడ చేతన మనే వివక్ష లేదు. చేతన సృష్టిలోనూ ఆ కీట మా కైటభమూ సమాన జాతీయమే. విజాతీయ మేదీ కాదు. మానవుడి చిత్త స్పందానికి ప్రతి స్పంద మివ్వ వలసిందే ప్రతిదీ. ఇచ్చిందని కూడా వర్ణిస్తాడు కాళిదాసు. సర్వ క్షితి భృతాం నాథ దృష్టా సర్వాంగ సుందరీ రామా రమ్యే వనాంతేస్మిన్ - మయా విరహితా త్వయా. సమస్త భూమండలాన్నీ ధరించే ఓయీ ఈ వనాంతంలో ఒక సర్వాంగ సుందరి నాచేత విరహిత అయినది నీ చేత దృష్ట అయినదా అని అడిగాడొక పర్వతాన్ని ఆ రాజు. అడిగితే అది ఆయన కలాగే జవా బిచ్చింది. పర్వతం గదా అది. పర్వత

Page 228

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు