సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
సేవిస్తూ వచ్చాడొక ధేనువు నామహాత్ముడు. అది మామూలు ధేనువుగా దాయన పాలిటికి. కామ ధేనువు. తల్లి లాగా సేవించాడు దాన్ని. అది ఆ రాజును బిడ్డలాగే చూచింది. ఉత్తిష్ఠ వత్సే త్యమృతాయ మానం వచః. లే నాయనా అని తన్ను సంబోధించిన దాని మాట అమృతంలాగా సోకా యా యన చెవులకు. దానికొక ఆపద కలిగిందంటే ఆయన మనసు నలిగి పోతుంది. తన శరీరమైనా త్యాగం చేస్తానని కూచున్నాడు చివరకు. ఇది చూస్తే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని అనికాళిదాస ప్రత్యభిజ్ఞ బోధించే సమదర్శనం జ్ఞప్తికి వస్తుంది. మరలా ఈ గోమాత రఘువు యుద్ధంలో మూర్ఛ పోయినపుడు సాక్షాత్కరిస్తుంది. దాని పంచితంతో కనులు తుడుచుకొంటే ఆ రాజుకు అలౌకికమైన చూపు లభిస్తుంది. గోవు గోవు గాదు. సాంకేతికంగా చెబితే జ్ఞాన స్వరూపిణి జగన్మాత పరాశక్తే. గో అంటే జ్ఞానమనే అర్ధం. పరశక్త్యు పాసనే సర్వాభీష్ట ప్రదాయిని అని కవి ఆంతర్యం. కాళిదాసుడు గదా ఆయన. ఇది గాక ఏ ముంటుం దిక కవి హృదయం. దీనికి తగినట్టు ఆ ధేనువు అరుణ వర్ణ. అరుణ ప్రభా భాసుర ఆ మహాదేవి కూడా. పోతే ఒక గోవేమిటి అశ్వమేమిటి. ఆ రాజులకు ప్రజలెంతో సమస్త ప్రాణులూ అంతే. పాలనీయులే. దశరథుడి వేట వర్ణన చూచాము గదా. హరిణాంగన హరిణ వల్లభుని బాణపాతం తగలకుండా అడ్డుపడితే బాణ ముపసంహరించ వలసి వచ్చిందాయన. తన అశ్వాని కతి సమీపంలో ఎగురుతున్న మయూరాన్ని కూడా తన కాంత కబరీభరం గుర్తుకు వచ్చి చూస్తూ కూడా కొట్టలేక పోయాడు. చమరీ మృగాల వాలం మాత్ర మూడగొట్టి ప్రాణాలు కాపాడుతాడు. ఏమిటీ వ్యవహారం. మానవులెంతో జంతువులూ పక్షులూ _ అన్ని ప్రాణులూ అంతేనని సమరస భావ మందివ్వటమే కవి హృదయం. ఇక రామ చంద్రుడి కైతే పంపా సరస్సు దగ్గరి నుంచీ జటాయువు నుంచీ గంగా సాగరాల నుంచీ కడకు సీతా దేవి కాలి అందె వరకూ అంతా బంధు కోటే. ఆయన కుమారుడు కుశ మహారా జేమీ తక్కువ వాడు కాడు. అర్థ రాత్రి వేళ పడక గదిలోనికి ముక్కూ మొగం తెలియని పడతి వచ్చి కనిపిస్తే
Page 226