#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అత్తవారింటికి వెడుతూ శకుంతల తండ్రితో. మరి ఆవిడను సాగనంపే టపుడా మహర్షి అడగకుండానే క్షామం కేనచి దిందు పాండు తరుణా మాంగల్య మావిష్స్కుతం. ఆశ్రమ వృక్షాలే ఒకటి పట్టు చీరలు సమకూరిస్తే ఒకటి పాదాలకు లత్తుక సవదరిస్తే ఇక కొన్ని వన దేవతా హస్తాల నుంచి నవాభరణాలనూ కుమ్మరిస్తాయి. ఈ వన దేవత లేమిటో వన జ్యోత్స్న లేమిటో - వారితో ఈ మానవుల కనుబంధ మేమిటో. కాళిదాసే కలిపాడీ సామరస్య సూత్రంతో ఇరువర్గాలను. వీరికే ఏమి వచ్చె. శకుంతల వెడుతున్నది - మరలా ఎప్పుడు చూస్తారో - మీరావిడకు అనుమతి ఇచ్చారా అని మహర్షి అక్కడ ఉన్న వృక్ష లతాదుల నడిగితే అనుమత గమనా శకుంతలా తరుభి రియం వనవాస బంధుభిః- అనుమతి ఇచ్చా మన్నాయట అవి. 'ఏదీ ఎలా ఇచ్చాయి ఇచ్చాయని ఎలా ఋజువని అడిగితే అదుగో వాటిమీద నివసించే పక్షులు చేసే కిల కిలా రావాలే అనుజ్ఞా వచనా లంటాడు కవి. ఎలాంటి వట ఆ వృక్షాలు. వనవాస బంధువులు. శకుంతల ఆశ్రమంలో పుట్టి పెరిగి నప్పటినుంచీ ఆవిడకు విడరాని చుట్టాలట అవి. ఈ విధంగా చెట్లూ చేమల దగ్గరినుంచీ మహర్షులూ దేవతల వరకూ అన్ని భూమికలతో సంబంధమే మానవుడికి.

  రఘువంశంలో దిలీపుడు సుదక్షిణతో కలిసి వసిష్టాశ్రమానికి ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో ఘోష వృద్ధులు తమ్ము చూడటానికి వస్తే దారి ప్రక్కనున్న చెట్ల పేర్లేమిటని వారినడిగి తెలుసుకొంటాడు. మహారా జేమిటి. గ్రామీణులైన ప్రజలేమిటి. వారితో సంభాషణ మేమిటి. ప్రజాయై గృహమేధినా మని దేశ ప్రజల కోసమే గృహస్థాశ్రమం స్వీకరించిన నిస్స్వార్థ జీవులా రాజులు. ఎలాటి స్థాయిలో ఉన్న ప్రజానీక మైనా సమానమే వారి దృష్టికి. చెట్లూ చేమలు కూడా ప్రాణులే. ఎన్నో విధాల ఉపయోగ పడుతున్నాయి మానవ జాతికవి. అది గ్రహించిన సహృదయులు గనుకనే అవి అన్నా సానుభూతి ఆ రాజన్యులకు. అంతే కాదు. సంతానం కోసమని

Page 225

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు