సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఉపాలంభించే అంతఃపుర కాంతల మాటలకు కూడా ఆగ్రహించడు. తన బంధు వర్గమే గాదు. స్వర్గం నుంచి వచ్చిన సుర సారధి మాతలిని కూడ బహుమాన పురస్సరంగా చూస్తాడు. నౌ వ్యసనంలో కన్ను మూసిన ధన మిత్రుడనే సార్ధ వాహుడి కుటుంబ విషయం తలచుకొని బాధ పడతాడు. అంతకు పూర్వం శకుంతల పోగొట్టుకొన్న తన అంగుళీయకం దొరకిందని తెలిసి ఆ బెస్త వాడిని మెచ్చుకొని వాడికెంతో బహుమాన మందజేస్తాడు. ఇలా కధానాయకులైన రాజులే కాదు. వారితో వ్యవహరించే మిగతా పాత్రలు కూడా కనిపిస్తారు. రాజులు మహర్షులనూ వారి శిష్యులనూ దేవతలనూ ఇలాటి వారిని సగౌరవంగా చూస్తే వారూ ఆ రాజులను సాభిమానంగా చూస్తారు. పరస్పరం వారు చూపే గౌరవ మర్యాదలు కవి వర్ణిస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది వినటానికి. పోతే రాజులెంత రసికులైనా దేవేరుల మనసెక్కడ నొచ్చుకొంటుందో నని పడే భయ సాధ్వస సంకోచాదులు చూస్తే మరీ ముచ్చట వేస్తుంది. ఎలాగైనా వారి నొప్పించి వారి అనుమతి తోనే ద్వితీయలను స్వీకరించిన సన్నివేశ మింకా వినోదకరం మనకు.
ఇలా మానవులు మానవుల సంబంధమే గాదు. మానవులకు తక్కువ జాతి అని మనం భావించే పశు పక్ష్యాదులూ కడకు లతా వృక్ష గుల్మాదులూ వీటి విషయంలోనూ ఇదే సామరస్యం చూస్తూపోతుంది మహాకవి దృష్టి, శాకుంతలంలో కథానాయిక శకుంతలకు అనసూయా ప్రియం వద్ద లెంత ఆప్తులో వన జోత్స్న అంతకన్నా ఆప్తమైనది. దీర్ఘాపాంగమని ఒక జింక పిల్ల ఉన్నదా ఆశ్రమంలో. అదంటే ప్రాణ మావిడకు. ఎంత ఇష్టమంటే అది సర్వ సృగంధేషు విశ్వసితి. ప్రతి ఒక్కరూ లోకంలో తన జాతి వారంటే అభిమానం చూపుతారని దుష్యంతుడు కూడా పరిహాస మాడుతాడు. ఆఖరుకు ఏషా గర్భ మంథరా వధూ ర్వదా అనఘ ప్రసవా భవతి తదా మహ్యం కమపి ప్రియ నివేద యితృకం విసర్జ యిష్యథ. గర్భవతి అయిన ఈ హరిణాంగన ప్రసవిస్తే ఆ శుభవార్త నాకు వెంటనే తెలియ జేయ మంటుంది
Page 224