సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
అచ్చం దేవి అయితే పక్షపాతిని అని చెప్పి పండిత కౌశికి సమక్షంలో మాళవిక అభినయం ఏర్పాటు చేయమంటాడు రాజు. ఇందులో రాజుగారి దగ్గర నాట్యా చార్యులిద్దరూ పేచీ పడుతుంటే రాజు ఎటూ మాటాడడు. ఇద్దరినీ ఆదరిస్తాడు. దేవి మనసు కూడా నొప్పించడు. పరివ్రాజిక అయిన కౌశికి కెంతో గౌరవ మిస్తాడు. ఆవిడ ఎవరో కాదు. మాధవ సేన సచివుడు సుమతి అనే వాడి సోదరి. రాజుకు దగ్గరివారు వారంతా. ఇంతకూ చెప్ప వచ్చే దేమంటే విదూషకుడు మొదలుకొని పట్టపురాణి వరకూ తనకన్నా తక్కువ వారైనా ఎక్కువవారైనా స్త్రీలను గాని పురుషులను గాని ఎవరినీ దూరంగా చూడడా ຜ.
ఈ ఒక్క అగ్ని మిత్రుడే కాదు. ఆ మాటకు వస్తే మిగతా నాటకాలలో కూడా ఏ కథా నాయకుడి దైనా ఇదే బాణీ. పురూరవుడైతే దేవతలు దేవేంద్రుడి మాట అటుంచి ఆపదలో చిక్కి తన్ను శరణు వేడిన అచ్చర లేమలనే ఎంతో ఆదరిస్తాడు. ఊర్వశినే గాదు రంభాదులైన ఆవిడ చెలికత్తెలను కూడా మర్యాదగా పలకరిస్తాడు. ఊర్వశి ప్రేమ వాగురలో తగులుకొన్నా కట్టుకొన్న పట్టపురాణిని విస్మరించడు. తక్కువగా చూడడు. ఆవిడ కెక్కడ కోపం వస్తుందో నని తాపత్రయం. శాకుంతలంలో దుష్యంతు డిక చెప్పనే అక్కరలేదు. కణ్వ కశ్యపులంటే ఆయనకు దైవ సమానులు. వారి యెడల చూపే గౌరవ ప్రపత్తు లెనలేనివి. కశ్యపుణ్ణి అయినా చివర సారిగా చూచాడేమో గాని అసలు కణ్వుణ్ణి చూడనే లేదు. ఏడంకాల నాటకంలోనూ ఒకరికొకరు తటస్థ పడనే లేదు. అయినా కణ్వుడికా రాజంటే అభిమానం. రాజుకాయన అంటే గౌరవం. తన పరోక్షంలో ఆశ్రమంలో ప్రవేశించి కూతురిని చెట్ట బట్టి ఆవిడ గర్భవతి అయిన సంగతి తెలిసి కూడా ఆగ్రహించలేదా మహర్షి. అలాగే ఆయన తన దగ్గరికి శిష్యులను పంపాడని తెలిసి వారినా మహర్షిని చూచినట్టే భక్తి తాత్పర్యాలతో చూస్తాడా రాజు. శకుంతలనే గాక ఆవిడ ప్రియ సఖులను కూడా అభిమానిస్తాడు. తుదకు శాప గ్రస్తుడై కూడా తన్ను
Page 223