సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
వ్యవహరించాలి గాని ఇదేమి ఇలా ఉంది - అదేమిటలా ఉందని ఆక్షేపించ రాదు. ద్వేషించరాదు. ఈ చరాచర సృష్టి త్రిపుర సుందరి లీలా విభూతే అని గదా చెప్పాము. ఇందులో ఒకటి ప్రియ మొకటి అప్రియమనే మాట కర్దం లేదు. అయితే అంతా ప్రియమే కాకుంటే అంతా అప్రియమే. దేని స్థానంలో అది సముచితం. కనుకనే పరమేష్ఠి దాని నలా సృష్టించాడు. అది గుర్తించే కవి పరమేష్టి ఇలా చేసి చూపుతున్నాడు కావ్య సృష్టి. కాళిదాస కవి కృతులలో ఎక్కడ ఎన్ని పాత్రలు మన కనులముందు మెదులుతున్నా వారిలో ఎన్ని హావ భావాలు వర్ణించినా- వారందరి మీదా మనకు సానుభూతి కలిగే లాగే వర్ణిస్తాడు కాళిదాసు. అసలా పాత్ర లొకరితో ఒకరు వ్యవహరించే టపుడు కూడా సమరస భావమే కనిపించేలా చేస్తాడు. ఒక మాళవికాగ్ని మిత్రమే తీసుకొని చూడండి. అగ్ని మిత్రు డున్నాడు. ఆయన ఒక దేశ మేలే మహా రాజు. ఎంతైనా దర్జాగా దర్పంగా ఉండవచ్చు. ఉండడు. విదూషకుణ్ణి తనకు సరి సమానంగా భావిస్తాడు. ఎవడీ విదూషకుడు. ఒక పేద బ్రాహ్మణుడు. ఏదో కొంత విద్యా బుద్ధు లున్నవాడు కావచ్చు. రాజు గారిని రాణీగారిని ఆశ్రయించుకొని వారి మనసుకు వినోదం కలిగిస్తూ తదనుగ్రహంతో కాలం గడుపుతుంటాడు. అయినా వారాయనను తక్కువగా చూడరు సరిగదా. అతడు వారితో ఎంతో చనువుగా ప్రవర్తిస్తూ కూడా! బ్రాహ్మణుడనే గౌరవం నిలపెట్టుకొంటాడు. ఆ మాటకు వస్తే కాళిదాసు నాటకాలలో ముగ్గురు విదూషకులూ ఇంతే. పోతే కేవలం తిండిపోతే గాక రాజుకు ప్రియా సంగమాదులలో సలహాలిస్తూ సహాయం కూడా చేస్తాడు ఈ నాటకంలో విదూషకుడు. మరి గణదాసాక నాట్యాచార్యుడు. రాణీ గారికి సన్నిహితుడు. రాజు గారికి కూడా ఇష్టుడే కాని ఎటువచ్చీ మాళవిక అతని శిష్యురాలు. పట్టపురాణికి రాజుకు మాళవిక కంటబడట మిష్టంలేదు. అది తెలిసి రాజూ విదూషకుడూ పన్నాగం పన్నుతారు గణదాసుకు హరదత్తుడనే మరొక నాట్యాచార్యుడితో తగాదా కల్పించి. శాస్త్ర జ్ఞానం కాదు - ప్రయోగించి చూపమంటారు నాట్యం. దానితో మాళవిక బయట పడక తప్పింది కాదు.
Page 222