#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

పోయా యంటాడు కవి. ఏమిటిది. ఇత్యద్భుతైక ప్రభవః ప్రభావా త్తని తరువాత చెప్పబోతాడు. పరమేశ్వరుడు గదా ఆయన . అలంకారాల కేమి లోటు. భసితమే అను లేపనం. అంటే భస్మం అనులేపనంగా మారింది. కపాలం కిరీటంగా మారిపోయింది. ఇలా అన్నీ ఆభరణాలుగా మారాయని అర్థం చేసుకోవాలి మనం. సర్ప శరీరాలు అలా మారాయనే గదా కంఠోక్తిగా వర్ణించాడు. ఎలా మార గలిగాయంటే ప్రభావాత్. ఆయన ప్రభావ మలాంటిది. పరాశక్తి ఆయన వశంలో ఉన్నప్పుడిది ఎంతపాటి విషయమని తాత్పర్యం. మరొక దృష్టితో మాటాడితే భస్మమూ అంగరాగమూ అనే తేడా లేదు - రెండూ ఒకటే పరమేశ్వరుడికి కాదు కాదు. కవీశ్వరుడికి. ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యఃస్వయం కృత్తి వాసాః. అనే మాళవిక నాందీ శ్లోకమే బయట పెడుతున్నదీ సామరస్యం మనకు. గజ చర్మం ధరించి అదే ఐశ్వర్యమని భావిస్తా డీశ్వరుడు. అర్థ శరీరంలో కాంతను ధరించి కాముకుణ్ణి కానంటాడు. ఈశ్వరుడు కాదనటం. ఈశ్వరుడి మీద నెపంపెట్టి కవీశ్వరుడైన కాళిదాసు. దేవాది దేవుని నిర్లిప్తతను వర్ణించాడంటే మానవుల నలాటి భావ మలవరుచుకో మని చెప్పటానికే గదా. మరి మానవు డలాటి ఉదాత్త గుణ మలవరచు కొంటేవాడు దేవతే. అదే గదా రఘు వంశ రాజులను గూర్చి చేసిన వర్ణన. అసక్త స్సుఖ మన్వ భూత్తని వారిని వర్ణిస్తాడు కవి. ఏది అనుభవించినా అందులో నిమగ్నమయి పోకుండా అనుభవిస్తారట వారు. అనుభవించటం మానేయ లేదు. అలాగని దానిలోనే పడిపోరు. ఇదే అనాసక్తి యోగమంటే. ఇలా దేవతలను మానవులను ఒకరి స్థాయికి మరొకరిని చేర్చి వర్ణించట మొక్క కాళిదాసుకే తగు. ఇది ఆయన రచనలో చూడగల ఒక గొప్ప సామరస్యం.

  ఇంతే కాదు. ఇంత కన్నా దూరం పోయాడు కవి. మానవులలోనే హెచ్చు తగ్గు లెన్నో ఉంటాయి. అవి వారి వారి సంస్కారాన్ని బట్టి ఏర్పడుతుంటాయి. అవన్నీ వాటి వాటి స్థానంలో చూచి సానుభూతితో

Page 221

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు