సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆయన దృష్టికి మీదనే కాదు క్రిందనూ కనపడు తుంది స్వర్గం. అలాగే క్రిందనే కాదు మీద కూడా భాసిస్తుంది భూమండలం. రెండింటినీ సమరసంగా చూడగల ఆయన సరసంగా వర్ణించి చూపగలడు. కుమార సంభవంలో అమ్మవారు పరమ శివుడికి పరి చర్య చేస్తూ అలసి పోయేది. అప్పుడాయన శిరశ్చంద్ర పాదాలు చల్లగా సోకి ఆవిడ తాపాన్ని హరించేవి. మరి ఆభరణా లేమైనాయో ఏమో. పద్మ రాగాల బదు లశోక పుష్పాలూ -కనకానికి బదులు కర్ణికారాలూ ముత్యాల దండలకు బదులు సిందువారాలు ధరించిందావిడ. పిమ్మట తపస్సు గావిస్తుంటే ఆవిడను చూచి కపట బ్రహ్మచారి చాలా బాధ పడతాడు -పెదవుల కోష్ఠ రాగం లేదని పాదాలకు అలక్తకం లేదని. ఇందులో చమత్కార మేమంటే అది లేకపోవటమూ ఉండటమూ ఒకటే. సహజ కాంతులు విరజిమ్మే రంగు రంగుల పుష్పాలు కృత్రిమంగా చేయించుకొన్న సొమ్ములకు తీసిపోవు. కిమివహి మధురాణాం మండన మని గదా తానే చెప్పాడొక సుభాషితం. సుందరమైన రూపాని కంతా సుందరమే. ఇంకొక్క చక్కని సన్నివేశ మిక్కడ ఉదాహరించి తీరాలి. అద్భుతమైన వర్ణనమది. పరమేశ్వరుడు కైలాస గిరి మీద ముస్తాబు చేసుకొంటున్నాడు పెండ్లికి. కానీ పెండ్లి కొడుకుకే ఆభరణాలూ లేవు. ఆది భిక్షువాయె. ఎక్కడి నుంచి వస్తాయా భరణాలు. అందుకే బభూవ భస్మైవ సితాంగ రాగః. భసితమే అనులేపన మయింది. కపాల మేవామల శేఖర శ్రీః. కపాలమే కిరీటమైంది. ఉపాంత భాగేషుచ రోచనాంకో గజాజినస్యైవ దుకూల భావః. గోరోచన కాంతులు చిమ్మే అంచులు గల గజ చర్మమే పట్టు దుకూల మయిందట. ఫాలనేత్రమే ఎఱ్ఱని తిలక మయిందట. ఇదంతా అలా ఉంచండి. యథా ప్రదేశం భుజగేశ్వరాణాం కరిష్యతా మాభరణాంతరత్వం శరీర మాత్రం వికృతిం ప్రపేదే తథైవ తస్థుః ఫణ రత్న శోభాః. ఒంటి మీద ధరించిన సర్పాలన్నీ ఆయా స్థానాలలో వాటికనురూపమైన అలంకారాలుగా మారాయట. అయితే శరీరాల వరకే ఆ మార్పు. పడగల మీద ఉండే రత్నాలు మాత్రం మార నక్కర లేదు కాబట్టి అలాగే ఉండి
Page 220