#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అయినా తెచ్చి ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇలాగే ఆ కౌత్సుడనే తపస్వి ఉన్నాడు. అతడు సహజంగానే నిర్ధనుడు. అయినా గురువుగారి కోసం డబ్బు కోరి వచ్చాడు. తీరా కుబేరుడు కనక వర్షం కురిపించి కోశాగార మంతా బంగారు నాణాలతో నిండి అది రాజు గారు దానం చేయబోతే నాకంత అక్కర లేదు కోరిందే ఇవ్వమంటాడా వటువు. నాకెందుకి దంతా నీకోసం కదా దేవత లిచ్చారు నీవే తీసుకు పొమ్మంటాడు రఘువు. ఎవడు తపస్వి. ఎవడు చక్రవర్తి. భోగం త్యాగం రెండూ సమానమే ఇద్దరికీ. మరి కణ్వ కశ్యపు లున్నారు. ఇద్దరూ ఇద్దరే. వారు ముక్కు మూసుకొని ఎక్కడో తపస్సు చేస్తున్నారా -కళ్ళు తెరచి చుట్టూ ఉన్న లోకంతో వ్యవహరిస్తున్నారా. తపశ్చర్యా ఉంది. లోక వ్యవహారమూ ఉంది. రెండూ ఉన్నాయి. రెండూ లేవు. కణ్వుడే అంటాడు వనౌక సోపి లోకజ్ఞా వయ మని. అసలు మహర్షుల పాత్ర రాని కావ్యం లేదు నాటకం లేదు కాళిదాసు రచనలో. అలాగే రాజుల పాత్ర లేనిదీ లేదు. ఇరువురికీ భేంటు చేయని సన్నివేశమూ లేదు. అలా ఆ రెండు పాత్రలూ దగ్గర పడి మాటాడుతుంటే ప్రవృత్తి నివృత్తి భావాలు రెండూ ఒకదాని నొకటి పలకరిస్తున్న అనుభూతి కలుగుతుంది రసజ్ఞుడికి. ఇద్దరిలో రెండు భావాలూ మిళితం కావటం మూలాన్నే రాజులకు వన గమనమంటే ఎంతో ఇష్టం. అలాగే మహర్షులు రాజ దర్శనార్థం నగరానికి రావటమంటే నిర్భయం. సమాధి వ్యవహారం రెండూ పరస్పర విరుద్ధంగా చూడరు వారు. రెండింటినీ గొప్పగా సమన్వయించుకొన్న జీవితాలు వారివి.

  వీరి విషయమే గాదు. రాజులూ ప్రజలూ - వీరిద్దరి విషయంకూడా అద్భుతం. ఆనంద దాయకం. ప్రజాః ప్రజాఃస్వా ఇవ పాలయిత్వా అంటాడు మహాకవి. ప్రజలంటే ప్రజలే రాజుకు. అంటే సొంత బిడ్డలే. ప్రజానామేవ భూత్యర్థం. వారి మేలుకే వీరి ప్రతి చర్యా. మరి ఆ ప్రజలో. ఆ మనో ర్వర్త్మనః పరం న వ్యతీయుః - ధర్మ మార్గం తప్పరాదు. తప్పితే శిక్ష తప్పదు. యథా పరాధ దండానాం. వారికా రాజెలా కనిపించేవాడు. అధృష్యశ్చాభి

Page 211

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు