#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

నిక్కడి నుంచి అక్కడికి పిలిపిస్తాడు మాతలికి రధమిచ్చి పంపి. ఆ రథం అయోధ్యకు తెస్తాడా సుర సారధి. అది ఎక్కి స్వర్గ సీమలకు వెడతారా మహారాజులు. ఆనాక రథ వర్త్మనా మట. నాకం వరకూ వారి రథ మార్గమే. ఏమిటీ అతిశయోక్తి. ఎలా వెళ్ళగలరని అడుగుతా రేమో. వసిష్ఠమంత్రోక్షణజ ప్రభావాత్ - ఉదన్వ దాకాశమహీధరేషు. కుల గురువు వసిష్ఠులవారి అనుగ్రహ ముంటే చాలు. ఆయన మంత్రించిన రథం మాతలి తెచ్చిన దివ్య రథమే కానక్కరలేదు. పార్దివమైన రథమైనా దానికి అరణ్య పర్వత సముద్రాదు లేవీ అడ్డురావు. ఆకాశ మంచులు చూడ గలదు. శకుంతల ఎక్కడ పెరిగింది. కణ్వాశ్రమంలో. ఎక్కడ ఉందా ఆశ్రమం. భూలోకంలో. మరి భర్త నిరాకరిస్తే ఎక్కడికి వెళ్ళిందావిడ. ఆశ్రమానికే. అయితే ఆ ఆశ్రమం భూలోకంలో లేదు. స్వర్గ సీమలో ఎక్కడో దూరదూరాన ఉంది. అక్కడికి వెళ్ళి కూచుందావిడ. ఇది భూ సంబంధి. అది స్వర్గ సంబంధి. ఇది కణ్వాశ్రమం. అది కశ్యపాశ్రమం. వారిద్దరూ మరలా ప్రాణ మిత్రులే ఆ మహర్షులు. ఒకరి కొకరికి రాకపోక లున్నాయి. దుష్యంతుడు కూడా అక్క డికే వెళ్ళి చూచా డావిడను. మరి ఆ శకుంతల ఎక్కడ కన్నదా భరతుణ్ణి. స్వర్గంలో. అతడా తరువాత ఏ రాజ్యం పాలించాడు. అది స్వర్గ రాజ్యం కాదు. భూరాజ్యం. ఏమిటీ వ్యవహారమంతా. జుట్టూ జుట్టూ ముడి వేసినట్టు ఎక్కడ స్వర్గం ఎక్కడ భూమి. రెంటినీ కలిపి ముడి వేశాడు మహాకవి. ఆయన దృష్టికి స్వర్గమే భూమి భూమే స్వర్గం. తేడా లేదు. పైగా స్వర్గ వాసులకు భూతలమంటే ఇష్టమట. ఉదార రమణీయా పృథివీ అని మాతలి చేతనే అనిపిస్తాడు శాకుంతలంలో. ఊర్వశి స్వర్వాసిని అయిన అప్సరస. భూలోక వాసి పురూరవు డావిడను కామించాడు. ఆవిడా ఆయనను మోహించి భరతాచార్యుని శాపానికి గురి అయింది. భూలోక నివాస సౌఖ్య మనుభవించ వచ్చు గదా అని అది ఆవిడ ఒక గొప్ప అనుగ్రహంగా భావించిందట.

Page 208

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు