సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మరొకరిని పారావారాని కిచ్చి కృతకృత్యు డయ్యాడా గృహస్థు. శకుంతల అత్తవారింటికి వెళ్ళుతూ తన పితృ పాదులు కణ్వునికి ఏమి చెప్పిందో తెలుసా. తన చెలికత్తెలు అనసూయా ప్రియంవదల సంగతి అలా ఉంచి దీర్ఘా పొంగ మనే ఆడు జింక గర్భవతి అయినది ప్రసవించ గానే ఆ శుభవార్త నాకు తెలియజేయ మంటుంది. లతా కాంత పుష్పించగానే కబురు పంప మంటుంది. ఆవిడ బయలు దేరుతోంది అనుమతించారా అని అడిగితే అక్కడి లతా వృక్షాలన్నీ కోకిలల విరావాలతో కణ్వునికి అనుమతి ఇచ్చారంటాడు మహాకవి.
ఈ విధంగా పిపీలికాది బ్రహ్మ పర్యంతం చరా చర జగత్తు నంతటినీ సమరస దృష్టితో దర్శించినపుడే వాడు ఋషి, అలా దర్శించి తరించమని భావుక లోకానికంతా బోధించినపుడే కవి. ఇలాటి ఋషిత్వం కవిత్వం వ్యాస వాల్మీకుల తరువాత ఎంతగానో సాధించినవాడు గనుకనే కాళిదాసు తన రచనలలో అవి పాత్రలే గాదు - వస్తువే గాదు - సన్నివేశమే గాదు - వర్ణనే గాదు - సర్వత్రా వెద జల్లి చూపాడా భావాన్ని ఆ భావ సామరస్యం బాణి మనసులో జితించిన వాడు కనుకనే నేమో అతడొకరిని హెచ్చని ఒకరిని తగ్గనీ భావించడు. సృష్టి అంతా శివ శక్తి విలాసమే అయినప్పుడా శివ శక్తుల వివర్తమైన శబ్దార్థ శరీరమే కావ్య సృష్టి అయినప్పు డిక న్యూనాధిక భావానికి చోటెక్కడిది. త్రిమూర్తులలో చూడలేదా తేడా ఆయన - స్త్రీ పురుషులలో చూడలేదు. అంతే కాదు. స్వర్గ మర్త్య లోకాలకూ చూడలేదు. మహీతల స్పర్శన మాత్ర భిన్న - మృద్దం హి రాజ్యం పద మైంద్ర మాహు: అని హెచ్చరిస్తుంది సింహం దిలీపుణ్ణి. ఎక్కడ ఉంది స్వర్గం. ఎక్కడో లేదది. భూతలం మీదనే ఉంది. అదే ఉత్తమ క్షత్రియుడి పాలనలో పొందే సౌరాజ్య సుఖం. రఘువంశ రాజు లెక్కడ ఉన్నారు. వారేది పాలిస్తున్నారు. వారున్నది భూలోకంలో పాలించేది భూమండలాన్ని కాని వారి స్నేహితు డెవరో తెలుసా. దేవేంద్రుడు. స్వర్గాధిపతి. అతని కేదైనా అవసర మేర్పడితే వీరి
Page 207