సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఈ జగజ్జనని మరలా ఆ జగదీశ్వరుడికే కుటుంబిని అయింది. వారి కళ్యాణోత్సవాన్ని తిలకించాడు కాళిదాసనే మహాగణపతి. జననీ జనకుల కశ్యాణ మేమిటి. తరువాత జన్మించిన తనయుడు దర్శించట మేమిటి. దర్శించి మనకు వర్ణించి చెప్పట మేమిటి. అది ఒకప్పుడు జరిగిన కళ్యాణమే అయితే అసంభవమే. కాని ఎప్పుడూ జరిగే కళ్యాణ మది. నిత్య కళ్యాణం పచ్చ తోరణం. శివ శక్తి సామరస్యం సార్వకాలికం. ఆ సామరస్యమే కళ్యాణ మంటే. అదే లోకాని కంతా కళ్యాణం. లోకమంతా అసలా శివ శక్తి మయమే గదా. సర్వత్రా నెలకొని ఉన్నా అది మనకు దృగ్గోచరం కాదు. కొంత గోచరమైతే కొంత అగోచరం. ఒకచోట ప్రకటమైతే మరొకచోట గుప్తం. అదే కాళిదాసు వంటి దార్శనికుడైతే ఎక్కడ బడితే అక్కడ ఎప్పుడు బడితే అప్పుడు ఏది పడితే అది నిర్విశేషంగా అలికినట్టు ఏక రూపంగా దర్శించ గలడు. ఆ విశ్వ రహస్యాన్నే మనకు మరలా వర్ణించి చెప్ప గలడు. పరస్పర విలక్షణంగా విభక్తంగా కనిపించే సమస్త భావాలలో అవిభక్తంగా పరచుకొని ఉన్న ఒకే ఒక స్వరూపాన్ని పట్టుకొంటేనే మానవుడికి తరణోపాయం. నిజమైన పరనిర్వృతీ ఉపదేశమూ ఆలంకారికు లుద్దేశించింది ఇదే. కాళిదాసాది మహాకవుల రచనా ధోరణిని తరచి చూచే వారిలాటి మాట సెలవిచ్చి ఉంటారు. మరి ఆ మహాకవి వర్ణించిన ఆ సామరస్య మేమిటో ఇంత వరకూ ఏకరువు పెడుతూనే వచ్చాము. శివ శక్తి సామరస్య మన్నందుకు ఆ పురాణ దంపతుల అన్యోన్య భావాన్నే ప్రదర్శించాడు మొదట. కాగా దానినే విస్తరించి తాను సృష్టించిన సమస్త స్త్రీ పురుష పాత్రలలోనూ వ్యంజనా మార్గంలో ఒలక పోశాడు. అది కూడా మానవ జాతిలోనే కాదు. పశుపక్షి వృక్ష లతాదులలో కూడా సాక్షాత్కరించిం దాయన ప్రజ్ఞా చక్షువుకు. ఆ మాటకు వస్తే పశు పక్ష్యాది ప్రాణులే కాదు. నదీ సముద్ర పర్వత పట్టణాదులు కూడా స్త్రీ పురుష మూర్తులే. వారిలో కనిపించింది కూడా ఆ సామరస్య రహస్యమే ఆయన దృష్టికి. హిమవంతుని ఉదంతం విన్నారుకదా. మరి ఆ హిమవంతుని బిడ్డలెవరు. పార్వతి ఒకరైతే భాగీరధి మరొకతి. ఒకరిని పరమేశ్వరుని కిచ్చి
Page 206