#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ఆంతరమైన తత్త్వాన్ని చూచే చూపులేక పోతే కాళఇదాసు మన దృష్టికొక పైలా పచ్చీసు సామాన్య రచయితే. సందేహం లేదు. కనుకనే ఇలాటి సామాన్య బుద్ధుల కలాగే కనిపించాడా మహా దార్శనికుడు. నిజంగానే వీరు భావించినట్టు మహాకవి ఉండి ఉంటే తన రచనలలో స్త్రీ పాత్ర నిర్మాణ మలా చేసేవాడు కాడు. అత్యుదాత్తంగా భావించాడు చిత్రించాడు స్త్రీ పాత్రను. స్త్రీని స్త్రీగా చూడలే దాయన. సాక్షాత్తు ఆ పరాదేవత గానే దర్శించాడు. తానే గాక తన నాయకుల నందరినీ అలాగే దర్శించమని బోధించాడు. ఆరాధించమని చెప్పాడు. పరాదేవతనే ఆయన కన్యగా చూచాడు. కాంతగా చూచాడు. మాతగా చూచాడు. కణ్వుడి కావిడ కూతురు. దుష్యంతుడికి పత్ని. భరతుడికి తల్లి. ఆ పరాశక్తే ఆయా భూమికలలో సాక్షాత్కరించిం దాయన మనో నేత్రానికి. మందాకినీ సైకతాలలో ఆడుతూ పాడుతూ ఒక రూపంలో - బస్సులూ బలి పుష్పాలూ తెచ్చి సేవ చేస్తూ ఒక రూపంలో హావ భావాలు ప్రదర్శిస్తూ ఒక రూపంలో - అనుకొన్నది జరగకపోతే తపన చెందుతూ ఒక రూపంలో అది మరలా ఫలించబోతుంటే సిగ్గుతో తల వంచుకొని మరి ఒక రూపంలో. పెళ్ళి పీటలమీద ఒక రూపంలో మధు కౌముదిలో వేరొక రూపంలో - అన్ని రూపాలలో స్త్రీనొక దేవతగా ఆరాధించిన వాడాయన. కనుకనే స్త్రీ జాతిమీద ఆయన కెనలేని గౌరవం పూజ్య భావం. హిమవంతుడి దాంపత్య జీవనాన్ని వర్ణించిన ఘట్టం చదువుతుంటే తెలుస్తుంది వనకు. భారతీయ కుటుంబ వ్యవస్థును గూర్చిఅందులో స్త్రీ పాత్రను గూర్చి ఆయనకున్న అభిప్రాయమెలాంటిదో. ఏతే వయ మిమే దారాః కన్యేయం. కుల జీవితం. ఇదిగో మేమున్నాము. మా ఆడవాళ్ళున్నారు. మా ఇంటికి వెలుగు లాంటిదీ కుమార్తె ఉన్నది. ఇవి సప్త ఋషులతో హిమవంతు డన్న మాటలు. తరువాత ఈశ్వరుడి సంబంధం ప్రస్తావించి నీ అభిప్రాయ మేమని వారడిగితే తనకు మనసులో ఇష్టమైనా పైకి తేలక శైలః సంపూర్ణ కామోపి మేనా ముఖ ముదైక్షత. తన భార్య మేనక వైపు తిరిగి ఆమె మొగం చూచాడట నీకిష్టమేనా అన్నట్టు. ఎందుకలా చూడటమంటే కాళిదాసంటాడు. ప్రాయేణ

Page 204

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు