#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ఊర్వశి కోసం ప్రాకులాడటం. శకుంతల ఒక అప్సరస కూతురే. ఊర్వశి ఒక అప్సరస్. ఇద్దరూ అభౌతిక స్వరూపలే. మాళవికా అదృష్టంగా మెలగుతూ అందరాని ఒక అప్సరస లాంటిదే. వారితో సాంగత్యం కోస మట్టులు చాచటమూ - అది దూరమైతే పరితపించటమూ మరలా వారు దగ్గరైతే ఆనందించటమూ - వారి సాంగత్యంలో బాహ్యాభ్యంతరాలు రెండూ మరచి పారవశ్యం చెందటమూ - ఇదంతా సుషుప్తి దశకూ జీవేశ్వర సంబంధానికీ తద్గతమైన ఆనందాను భూతికీ ప్రతీకగానే సృష్టించాడు మహాకవి. అంతే కాదు. శకుంతలాదులా నాయకులను గాంధర్వ వివాహం చేసుకోటమూ స్వయంగా వరించటమూ వారి పొందుకోసం తామూ తమకించటమూ ఇదీ ప్రతీకే.

  ఏతావతా చెప్ప వచ్చేదేమంటే కాళిదాసు తన రచనలో స్త్రీ పురుషుల శృంగార మెక్కడ ఎలా వర్ణించినా అది లౌకికంగా భావించరాదు మనం. అలౌకికమైన జీవేశ్వర సంబంధాని కది లౌకికమైన సంకేతం. స్త్రీ ఆ పరాదేవతే ఆ దేవీ భక్తుడుకి. దూర దూరంగా తొలగి పోయే ఆ దేవత సాక్షాత్కారానికీ సాంగత్యానికీ చేసే నిర్విరామ మైన కృషే నాయకుల ప్రవృత్తిలో చూపాడాయన. పోతే తీవ్రమైన ఆ కృషి కనుగుణంగా ఆ దేవత స్పందించి చివర కతనికి ప్రసన్న అయి తన సాయుజ్య సుఖాన్ని అనుగ్రహించటమే శకుంతలాది నాయికల వ్యవహారంలో ప్రదర్శించాడు. అంతే గాని శకుంతల శకుంతలా గాదు. ఊర్వశి ఊర్వశీ కాదు. ఆ నేపథ్యంలో దాగి ఉన్న పరా దేవతే వారు. అవ్యక్త అయిన ఆ దేవి వ్యక్త రూపాలు. అలాటి దేవీ స్వరూపిణులు గనుకనే ధీరోదాత్తులూ సకల దైవ గుణ సంపన్నులూ అయిన ఆ చక్రవర్తు అంతగా వారి సాంగత్యం కోసం ప్రాకులాడటం. చక్రవర్తు లేమిటి. సాక్షాత్తూ పరమేశ్వరుడే తాళలేక పోయా డావిడ నెడబాయటానికి. తాళలేక కపట బ్రహ్మచారిగా అవతరించాడు. పొమ్మని కసరి కొట్టినా వెళ్ళిపోక చేయి పట్టుకొంటాడు. తన నిజరూపం చూపి సిగ్గుపడి ఆవిడ వెళ్ళిపోతే

Page 202

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు