సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
స్వయం గ్రాహ సుఖం. సరిగా కాళిదాసు నాయికా నాయక వ్యవహా రమిదే. న ఇలాగే సాగింది. చూచారో లేదో నాట కాలేచూడండి. మూడు నాటకాల్లోనూ నాయకులు ముందు ఆయా నాయికల పొందు కోస మెంతో తహ తహ పడతారు. వారి కంతకు ముందు కాంతలు లేరని కాదు. అసంఖ్యాకంగా ఉన్నారు. పైగా వారందరికీ ఒక పట్ట మహిషి కూడా ఉంది. అది వసుమతి కావచ్చు ధారిణి కావచ్చు. కాదు కాదు. ఇది కవి కల్పించిన సంకేతం. వసుమతి ఈ వసుమతే, ధారిణి ఈ ధారిణే, అంటే భూమండలమే. ఇది అనుభవిస్తూనే ఆ దుష్యంతుడు గానీ ఆ పురూరవుడు గానీ దీనికి అదనంగా ఆ శకుంతలాదుల పొందుకై అట్టులు చేస్తారు. ఎలాగో దీనిని ఒప్పించి చివరకు దానిని పొంది ఆనందిస్తారు. ఏమిటి అర్థం. భౌమమైన సంబంధం. జీవుడి కెంత ఉన్నా అది తృప్తి నీయదు. దాని కతీతమైన దివ్య తత్త్వంతో సంబంధ మేర్పడితేనే పరిపూర్ణత. పరితృప్తి. అదే గదా అవస్థా త్రయంలో మనం చూస్తున్న విషయం. జాగ్రత్స్వప్నాలు రెండింటిలో భౌతికమైన సంబంధం వదలలేదు మనలను. దానితో సతమతమై ఆ శ్రమ తీర్చుకోవాలని గాఢ నిద్ర పడితే బాగుండునని దానికోసం తహ తహ లాడుతాము. చివరకు మంచి నిద్ర పడితే ఎంతో ఆనందం. బ్రహ్మానందం. బ్రహ్మంతో ఏక మవుతాము గనుగనే అలాటి ఆనందం.
చూడండి. ఈ సంకేత మెలా సరిప డుతున్నదో నాయికా నాయకుల వ్యవహారంలో. అసంఖ్యాకమైన రాణు లసంఖ్యాకంగా కనిపించే చరా చర జగత్తే కాళిదాసు దృష్టిలో. పట్టమహిషి ఎవరో కాదు. ధారిణి వసుమతి అని పేరు పెట్టిన భౌతికమైన సంబంధమే. జాగ్రత్స్వప్నాల లాగా దీనితో సతమత మవుతున్నాడు నాయకుడు. అంటే జీవుడు. అంచేత వాడు దీన్ని తప్పించుకొని అతిలోకమైన అభౌతికమైన సుషుప్తిలాటి ఒక స్థితి నందుకోవాలని దానితో సుఖ పడాలని చూస్తున్నాడు. అదే దుష్యంతుడు ఒక శకుంతల కోసం - అగ్నిమిత్రుడు ఒక మాళవిక కోసం విక్రముడొక
Page 201