#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

చేశాడని గాదు కవి వివక్షితం. స్త్రీ పురుషుల కిరువురికీ ఎలాటి సమరస భావమున్నదో ఉండాలో చాటి చెప్పటమే. మహేశ్వరుడి విషయంలో చెప్పినా ఇంతే. మహర్షుల విషయంలో నైనా ఇంతే. మహారాజుల విషయమైనా ఇంతే. శివ పార్వతుల విషయంలో చూచాము గదా. స్త్రీకా పరమ శివుడే ఎంత గౌరవ మిచ్చాడో. పార్వతిని చెట్టబట్టాలని ఆయన తహ తహ పడుతుంటే చూచి సప్త మహర్షులు మనసులో అనుకొన్నారట - మనం పెండ్లి చేసుకొన్నామని ఏ మాత్రమూ సిగ్గు పడ నక్కర లేదని. వారికే సిగ్గు లేనపు డిక దుష్యంతుడి లాంటి మహా రాజుల కెందుకది. అందుకే వార్తా పాటికే అంత అవరోధ జన మున్నా ఆ శకుంతల కోస మొకరూ - ఆ ఊర్వశి కోస మొకరూ అలా ఆరాట పడ సాగారు. అంత ఆరాటంలోనూ పట్ట మహిషిని కాదనలేక పోయారు. ఆవిడ కెక్కడ కోపం వస్తుందోనని ఆందోళన పడ్డారు. ఆవిడను బ్రతిమాలి ఆవిడ అనుమతి తోనే పరిగ్రహించారా ద్వితీయలను. సామాన్య ప్రతిపత్తి పూర్వకమని కణ్వ మహర్షి అన్న మాట ఎంతో సార్థకమైన మాట. స్త్రీ లందరికీ సమాన ప్రతిపత్తే. అందరి సౌమనస్యమే కావాలి రాజుకు. ఆ రాజు సౌమనస్యం వారందరికీ కావాలి. వైమనస్య మైతే అది వైరస్యానికి మూలం. అది సామరస్యాని కపశ్రుతి. అలాటి అపశ్రుతి వినలేడు కాళిదాసు. సామరస్యం నూటికి నూరుపాళ్ళూ పుడికి పుచ్చుకొన్న ఆ ప్రణయ మూర్తుల ఆదర్శ దాంపత్య జీవితాన్ని లోకానికి ప్రదర్శించటమే ఆయన పెట్టుకొన్న ధ్యేయం.

  అది ఆదిమ దంపతులలో ఎలా దర్శించాడో తదీయ లీలా సంభూతమైన ఈ చరాచర సృష్టిలోనూ అలాగే దర్శించాడు. అదీ ఆ మహా కవిలో ఉన్న విశేషం. దేవతలలో చూచెడా దాంపత్య విభూతిని. మహర్షులలో చూచాడు. మహా రాజులలో చూచాడు. తుదకు పశుపక్ష్యాదుల లోనూ చూడ గలిగాడు. అకాలంగా వసంత మావిర్భవిస్తే స్థాణ్వా శ్రమంలో ఎక్కడ చూచినా ఆయన కదే దర్శన మిచ్చింది. మధు ద్విరేఫః కుసుమైక పాత్రే - పపౌ

Page 196

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు