#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

నీలమమ్మ వారు లోహిత మయ్యగారు. రెండూ కలిసి నీలలోహితం. ఇందులో నీలాన్ని లోహితంలో లోహితాన్ని శుద్ధమైన ఆత్మ చైతన్యంలో ప్రవిలయం చేసుకొన్న భావుకుడి కిక భవమేముంది. భవమే లేని వాడికి పునర్భవమేముంది.

  ఇదీ ఇలాంటిదీ మహాకవి దర్శించిన సామరస్యం. ఏతా దృశ మైన దర్శనానికే నోచుకోలేదు నూటికి తొంబది మంది కవి శబ్ద వాచ్యులు. పోతే దర్శనమే గాక దాని నంతటినీ తన రచనలలో నింపి వర్ణించి చూపాడంటే ఎంత ప్రతిభా భాసురుడో చూడండి కళిదాసు. ఇంతకు ముందే సూచన చేసి ఉన్నానొక విషయం. కాళిదాసు సృష్టించిన నాయికా నాయకు లెవరో కాదు శివ శక్తులేనని. శివ శక్తుల నమూనాలో చిత్రించిన చిత్రాలే ఆయన పాత్రలు. వీరి పరస్పర ప్రేమ కలాపమంతా వారి ప్రేమ కలాపమే. కనుకనే వారిలో చూచిన* సామరస్యమే వీరిలోనూ చూడ గలిగాడా కవి. ఈ సమరస దృష్టితో చూచిన వాడు గనుకనే స్త్రీ పురుష పాత్రలను చిత్రించే టపు డెవరినీ తక్కువగా చూపడు. ఎక్కువగా చూపడు. ఇరువురూ సమ స్వభావులే ఆయనకు. ఆయనే అంటాడీ మాట కూడా. సప్తమహర్షు లరుంధతితో సహా కైలాసానికి వస్తే వారి నందరినీ సమానంగానే ఆదరించాడట పరమ శివుడు. ఎందుకంటే (స్త్రీ) పుమా నిత్యనా స్ట్రైషా - వృత్తంహి మహితం సతం. ఇది స్త్రీ వీడు పురుషుడని తేడా చూడరు వారి శీలము వృత్తమే గమనిస్తారు మహాత్ములని సంజాయిషీ ఇస్తాడు మనకు కాళిదాసు.

  ఇది పార్వతీ పరమేశ్వరులనీ మహర్షి దంపతులనే కాదు. కావ్యంలో ఏ నాయికా నాయకులైనా వారికి ప్రతిబింబాలే ప్రతీకలే కవి దృష్టికి. సుదక్షిణా దిలీపుల పరస్పరాను రాగాన్ని వర్ణిస్తూ ఇలా అంటాడొక అత్బుతమైన మాట. రథాంగ నామ్నో 8వ భావ బంధనం బభూవ యత్ప్రేమ పరస్పరాశ్రయం - విభక్త మస్యేక సుతేన తత్తయోః పరస్పర స్యోపరి పర్యచీయత. చక్రవాకాలని రెండు పక్షు లున్నాయి. అవి ఎప్పుడూ జంట పాయకుండా

Page 194

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు