సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కీర్తించాడు. శాకుంతలాంతంలో నైతే పరిగత శక్తి రాత్మభూః అని శివ శక్తుల నేకాత్మకంగానే ఏకరువు పెట్టాడు.
ఈ ఏకాత్మ భావమే సామరస్య మంటే. సమో న్యూనాధికో రసో యయో స్తయో శ్శివ శక్త్యా ర్భావ స్సామరస్య మని నిర్వచించారు భాసురానందులు. తన తరువాత ఎన్నో శతాబ్దాలకు వచ్చిన భాస్కరాచార్యులే గ్రహించిన ఈ సామరస్య రహస్యం సాక్షాద్దేవీ భక్తుడూ శివ దీక్షా పరాయణుడూ తదీయ కథా సంకీర్తన ధన్యమ్మన్య జీవనుడూ అయిన కాళిదాసు గ్రహించటంలో ఆశ్చర్య మేముంది. గ్రహించాడు. ఎంతగా గ్రహించాలో అంతగా గ్రహించాడు. తస్మా చ్చబ్దార్థ చింతాసు న సావస్థా నయ శ్శివః అని శివాద్వైతులు వాక్రుచ్చినట్టు లోకంలోనే గాదు. సారస్వత లోకంలో కూడా శబ్దార్థా లనేవి రెండూ శివ శక్తి రూపాలుగానే దర్శన మిచ్చాయా మహాత్ముడికి. ఒకటి హెచ్చు ఒకటి తగ్గు అనే తేడా లేకుండా రెండూ సమరసంగానే సాక్షత్కరించాయి. ఆదిమ దంపతులలో చూచిన ఆ సమరస భావమే శబ్దార్థ రూపాలలో ఎప్పుడు ప్రత్యక్ష మయిందో అప్పుడా శబ్దార్థాలనే సామగ్రితో నిర్మించిన కావ్య జగత్తంతా సామరస్య పరాయణమే అయి కూచుంది. ఏ కథ తీసుకొన్నా అందులో ఏ సన్నివేశం కల్పించినా - ఏ వర్ణన చేసినా - ఏ కే పాత్రను చిత్రించినా - అందులో ఏ భావాన్ని ఆవిష్కరించినా సమ దృష్ట తప్ప విషమమైన దృష్టి లేదా మహా కవికి. అంటే అర్థం ఎటూ మొగ్గు చూపడు. దేనితోనూ తాదాత్మ్యం చెందడు. ఒకటి నెత్తిన పెట్టుకొన డొకటి త్రోసి పారేయడు. పైనుంచి క్రింది వరకీ జడ చేతనాత్మకమైన సృష్టి నంతా సమభావంతో సానుభూతితో చూచాడా మహాకవి. ఆ దృష్టి కక్షరాలా సరిపడే లాగే సృష్టించాడు తన కావ్య ప్రపంచాన్ని. యథాస్మై రోచతే విశ్వ మని గదా ఆలంకారికుల సూక్తి. అది కాళిదాసు ప్రవృత్తిని బట్టే బయట పెట్టారేమో వారు. నాట్యం భిన్నరుచే ర్జనస్య బహుథా ప్యేకం సమారాధనం. భిన్న రుచులు గల లోకులందరినీ ఏకోన్ముఖులను చేసి అలరించేది నాట్యమే నని గదా
Page 192