సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
సామరస్య ప్రత్యభిజ్ఞ
మన మింత వరకూ మహా కవి తాత్త్విక చింతనా దాని కనురోధిగా సాగిన కావ్య రచనా అందులో అడుగడుగునా ఆయన ప్రదర్శించిన సౌందర్య శిల్పమూ - యథా శక్తిగా తడవీ చూచాము. దీనిని బట్టి ఈ పాటికే మన మర్థం చేసుకొని ఉండ వచ్చు ఆ కళాకారుడి స్వరూప మేమిటో ఆయన ఈ మానవ లోకాని కందజేసే సందేశ మేమిటో. ఒక్క మాటలో ముక్తసరిగా చెబితే సామరస్యమే ఆయన తన జీవితంలో అందుకొన్నదీ మనబోటి సహృదయుల కందించిందీ. మరేదీ కాదు. అదే ఆయన జీవితం. అదే ఆ మహనీయుడి కావ్య జీవితం కూడా. సామరస్య మనగానే నాకు దేవీ 'నామావళి స్మరణకు వస్తున్నది. అమ్మవారికి సామరస్య పరాయణా అని ఒక నామ ముంది. దాని కర్ణం వ్రాస్తూ భాస్కరాచార్యులు అభియుక్తులైన పెద్దల సుభాషిత మొకటి ఉదాహరించారు. పరస్పర తపస్సంప త్పలాయిత పరస్పరౌ - ప్రపంచ మాతా పితరౌ ప్రాంచౌ జాయాపతీ స్తుమః - అంతే కాదు. సాక్షాత్తూ కాళిదాసోక్తి అని చెబుతూ ఒక శ్లోకం కూడా ఆయన పేర్కొన్నారు. భోక్తృ భోగ్య కరణోర్మి సంక్షయే సామరస్య రస దోహినీ శివా. ఇది కాళిదాసు నోటనే పలికిన మాట అట.. ఇదే నిజమైన నాడు సామరస్య మనే భావం మహాకవి కాళిదాసు మనసులోనే ఉందన్నమాట. కాకపోయినా ఆయన నామధేయ మేమిటి. కాళిదాసు. కాళి అంటే ఎవరు. సాక్షాత్పరా దేవతే గదా. ఆవిడకు దాసుడంటే ఆయనకు కూడా దాసుడే. ఆయనా ఆవిడా అని తేడా ఏముంది. శివ శక్తులు రెండూ ఒకే ఒక తత్త్వమా మహాత్ముడికి. అది మనం క్రొత్తగా ఊహించ నక్కర కూడా లేదు. రఘువంశం ప్రార్ధనా శ్లోకంలోనే తెలిసిపోతున్నది. వాగర్థాలలాగా ఒకరిలో ఒకరు కలిసిపోయిన ఏకైక స్వరూప మది. కనుకనే పితరౌ అని ఏక శేషంగానే సూచించాడా తత్త్వాన్ని. మరి మాళవికా నాందిలో కాంతా సంమిశ్ర దేహః అని వాచా
Page 191