సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కాముక వ్యవహారాన్ని సూచిస్తున్నాడు కవి. ఇందులో రెంటికీ పనికి రావాలని ప్రతి మాటా రెండు భావాలకు ద్యోతకంగా ప్రయోగించాడు. అదీ అద్భుతం. పైకేమీ కనపడదు. అయినా మాటలు చెబుతుంటాయి మనకా రహస్యం. ఉత్తర దిశ ఒక కాంత. అది కుబేర గుప్త. కుబేరుడంటే దుర్బల శరీరుడు. వాడు కాపాడు తున్నాడు దాన్ని ఎవరైనా తీసుకు పోతారేమో నని. అయినా లాభం లేదు. గంతుం ప్రవృత్తే. దాన్ని పొందాలనే తహ తహ లాడు తున్నాడు. ఎవడా పురుషుడు. ఉష్ణ రశ్మా. ఉష్ణ రశ్మి అట. మదనానలం చేత బాగా వేడెక్కిన వాడు. చాలా చురుకైన స్వభావ మున్నవాడు. లెక్క చేయడా బలహీనుణ్ణని అర్థం. అందుకే సమయం విలంఘ్య. మర్యాద కూడా దాటి పోతున్నాడు. సమయమనే మాట చూడండి ఎలా వాడుతున్నాడో. కాలమనీ అర్థమే మర్యాద అనీ అర్థమే. అసలు గంతుం అనే మామూలు క్రియా పదమే చూడండి. రెండర్థాలు స్ఫురిస్తాయి. గమనమంటే సంభోగమని కూడా అర్థమే భాషలో. ఇలాంటి అర్దాంతరమే మనసులో లేకుంటే ఉత్తర మనకుండా కుబేరగుప్తా మని- అయనమన కుండా సమయమనీ బొట్టుపెట్టి ఆ మాటలే ప్రయోగించటం దేనికి. అంతే గాదు. దిగ్ధక్షిణా అనటంలో దక్షిణ దిశ అనే గాక దాక్షిణ్యంగల స్త్రీ అని గూడా ధ్వనిస్తున్నది. ఉత్తర దగ్గర రాదు గాని దక్షిణ దగ్గర సహజంగానే రెండర్థాలూ స్ఫురిస్తాయి. అలా స్ఫురించే చోట డొంక తిరుగుడుగా చెప్పడు కవి. వదిలేస్తాడు. శబ్ద ప్రయోగంలో ఇంతటి ఔచిత్య మెరిగిన ఓకోవిదు డాయన.
అసలింకో మాట. వాడిన శబ్దమే మరలా వాడట మిష్టం లేదాయనకు. సమర్దుడైన రచయిత కెవడికీ ఇష్ట ముండ దలా ప్రయోగించటం. అది పాఠకుడికి విసుగు పుట్టిస్తుంది. అయితే ఒక వస్తువు పదే పదే ప్రస్తా వించ వలసి వస్తుంది కావ్యంలో. అలాంటప్పు దాశబ్దాని కెన్ని పర్యాయాలున్నవో అన్నీ తడవి చూచి సమయోచితంగా ప్రయోగించాలని చూస్తాడు కవి.
Page 178