సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
నోటినుంచి గడ్డి పోచలు జారి క్రింద పడుతున్నాయి. ఏమి అద్భుతమైన వర్ణన లివి. వర్ణనలా వర్ణ చిత్రాలా.
అందులోనూ మరొక చిత్రమేమంటే అల్లసానివారు సెలవిచ్చినట్టు భాషలోని వర్ణాలకు రంగు లుంటాయి. వాసన లుంటాయి. రుచు లుంటాయి. స్పర్శా ఉంటుంది. లోకోత్తరమైన మహా కవి దృష్టికే అవి సాక్షాత్కరిస్తాయి. మరెవరికీ అంతుపట్టదు. తతిమా శిల్పాలన్నీ ఎలాగో ఈ శిల్పాన్ని కూడా అలాగే అధ్యయనం చేశాడు వాల్మీకి వద్ద కాళిదాసు. రరాస భూమి ర్శతతాప భానుమాన్ అని మహర్షి వర్ణిస్తున్నాడంటే ఒరపిడి సోకటంలేదా వేడి సోకటంలేదా మన హృదయాలకు. ఆస్పోట యామాస చుచుంబ పుచ్ఛ మంటే శబ్దం వినిపించటంలేదా. తారాభి రభిరామాభి రుదితాభిః అంటుంటే తళ తళ మని మెరసే నక్షత్రాల తళుకు కనిపించటంలేదా. అంతేగాక శక్య మంజలిభిః పాతుం వాతాః కేతకి గంధినః అని విసర్గ పూర్వక పకార కకారా లుచ్చరిస్తుంటే ఆ సుగంధ మారుతాలు పానం చేసే రుచి తెలియటం లేదా. ఇలాటి రచనా మంత్ర రహస్యా లెన్నో ఆ గురువుగారి శుశ్రూష చేసి గ్రహించిన వాడాయె. అందుకే ఆ బాణీ వదలకుండానే తన వాణీ విలాసాన్ని కూడా చూడమని మనకు చూపుతుంటాడు. అది మరీ మనోహరం మహోజ్జ్వలం. సుప్త సర్ప ఇవ దండ ఘట్టనా ద్రోషితో స్మి తవ విక్రమ శ్రవాత్తంటాడు రాముడితో పరశురాముడు. పాము బుస కొట్టి పైకి లేస్తున్నట్టే ఉంది రచన. ఆ సవ్వడి వినిపిస్తూనే ఉంది. పశ్చాదద్రి గ్రహణ గురుబిః అనటంలో కొండ పట్టుకొని ప్రాకే స్పర్శ తెలుస్తూనే ఉంటుంది. మధ్యే యథా శ్యామ ముఖస్య తస్య-శ్యామాయ మానాని వనాని పశ్యన్. ఇలా శ్యవర్థం తరుచుగా వాడితే అది నల్లని రంగును మనసుకు చూపుతుందని తెలుసు మహాకవికి. అందుకే నల్లని చూచుకాలను నల్లని చీకటిని వర్ణించేటపు డలాటి వర్ణమే పట్టుకొంటాడు. మరి ఎఱ్ఱని రంగుకో ఉండనే ఉంది రవర్ణం. రేఫ ఎప్పుడూ
Page 173