సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కథలో తమకు కలిగిన అవరోధాలన్నీ గడచి బయట పడ్డారా లేదా. అంతే కాదు. వారి కోరికలు కూడా ఫలించాయి. ఇదే కామా నవాప్నోతు అనే మాట కర్థం. మొత్తాని కందరూ చివరకు నందంతు ఆనందోత్సాహాలతోనే ముగిసింది కథ. లోకాన్ని నెపంగా పెట్టుకొని చెప్పినా లోకానికే గాక కథా లోకానికి కూడా ఆలోకాన్ని ప్రసాదిస్తున్నది చూడండి ఈ సుభాషితం.
ఏవం విధ నానా విశేషణ విశిష్ట మైనది కాళిదాస మహాకవి వర్ణనా సౌందర్యం. అది భావమే గాదు - వస్తువే గాదు- బాహ్య ప్రకృతే గాదు ఏది వర్ణించినా మనోహరమే. బహుళార్థ సాధకమే. వీటన్నిటినీ మించి సర్వులూ సర్వకాలమూ స్మరిస్తూ ఆనందించ వలసిన పరమాద్భుతమైన భావాలెన్నో లభిస్తాయి మనకాయన కవితా రత్నాకరంలో. త్రవ్వి తలకెత్తుకో వలసిన రత్నాలు. అవి ఇక ఏ కవి లోనూ ఏ రచనలోనూ దొరకని అమూల్య రత్నాలు. వాటిలో కొంత సరకైనా బయట పెట్టకపోతే ఆయన కపచారం చేసిన వాడ నవుతానని భయం. చూడండి. కుశ మహారాజు నిద్రిస్తుంటే అర్ధరాత్రి పడక గదిలోకి ఒక అజ్ఞాత స్త్రీ ప్రవేశిస్తుంది. ఎవరో కాదావిడ. అయోధ్యా పుర దేవత. ఎలాంటి దావిడ ప్రవేశం. ఛాయా మివా దర్శతలం ప్రవిష్టా మంటాడు మహాకవి. తలుపులు తీయకుండా లోనికి రావట మద్దంలోనికి నీడ వచ్చిన ట్టున్నదట. ఏమి భావన. రాముడు సీత ఆభరణాలు ఋశ్యమూకం మీద చూచి బాధ పడ్డ వృత్తాంతం మరలా సీతకు చెబుతూ అంటాడు. నీ కాలి అంది పాపమా సమయంలో నీవు దూర మయ్యావని కాబోలు నాలాగే ఏమీ పలకలేక మౌనం వహించిం దంటాడు. అంతే కదా మరి. కాళ్ళకు పెట్టుకొని నడుస్తుంటే ధ్వనిస్తుంది అందె. లేకుంటే ధ్వని చేయదు కదా. అది వియోగ దుఃఖంతో నిశ్శబ్ద మయిందనట మెంత సొగసు. చీనాంశుక మివ కేతోః -ప్రతి వాతం నీయమానస్య అని వర్ణిస్తాడు దుష్యంతుడి అవస్థ. శరీరం ముందుకు పోతున్నా మనసు వెనుకకు లాగుతున్నదట. ఎలా ఉన్నదది. జెండా కఱ్ఱను ముందుకు పట్టుకెడుతుంటే దానికి కట్టిన వస్త్రం గాలికి
Page 165