సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కష్టాల నను భవించినప్పు డనుభవించినా చివర కది మంచు పొర లాగా విరిసి పోయి మరలా సుఖాంతంగానే ముగిసింది వారి జీవితం. కాదు నాటక జీవితం.
ఒక్క శాకుంతల నాటకమే గాదు. విక్రమ మాళవికలు కూడా తక్కువవి కావు. ఎక్కడో ఒక కీలకం దొరుకుతుంది నాటక నిర్మాణ రహస్యాన్ని బయట పెట్టేది. నాటక కథకంతా వన్నె తెచ్చేది. గణదాసు డనే నాట్యా చార్యు డంటాడొక గొప్ప మాట. విద్యకు నికషోపలం విద్యావంతుల తోడి చర్చే. అప్పుడే సత్యమేమిటో బయట పడుతుంది. అలా కాక యస్యా గమః కేవల జీవికాయై. ఎవడు పుస్తకాలు మాత్రం చదివి కేవలం దాన్ని జీవనాధారంగా పెట్టుకొంటాడో తం జ్ఞాన పణ్యం వణిజం వదంతి. లోకులు వాణ్ణి ఏమంటారో తెలుసా. జ్ఞానమనే సరకు విక్రయించు కొని ప్రతికే ఒక సౌదాగరని ఆక్షేపిస్తారు. జ్ఞానమనేది వ్యాపారంకాదు. పార దర్శనం. గొప్ప సూక్తి ఇది. శాస్త్ర కళా రంగాలలో కృషి చేసేవా రందరికీ శిరోధార్య మైన సూత్రం. ఇలాంటిదే మరొక సూత్రం మాళవిక చివరిలో వస్తుంది. అంతవరకూ మాళవిక ఎవరో తెలియక ఒక్క సారిగా ఆవిడ గతంలో ఫలానా అని గ్రహించిన అగ్ని మిత్రు డిలా అంటాడు. ప్రేష్య భావేన నామేయం దేవీ శబ్ద క్షమా సతీ - స్నానీయ వస్త్ర క్రియయా - పత్రోర్థం వోప యుజ్యతే. అహో పరిభవోప హారిణో వినిపాతాః. పట్టపు రాణిగా బ్రతక వలసిన ఈ కన్య ఇంత కాలమూ పరిచారికగా చలామణి అవుతూ వచ్చిందా. విలువైన చీనాంబరాన్ని స్నానంచేసి తుడుచుకొనే బట్టగా ఉపయోగించామా. అయ్యయ్యో ఏదైనా విలువ గుర్తించక పోతే ఇంతే గదా. అయినా మన తప్పు గాదు. ప్రకృతి లోనే ఎవరికైనా రోజులు చాలక పోతే మొగం చాటు చేసుకొని బ్రతుకు సాగించక తప్పదు. చూడండి. మాళవికాగ్ని మిత్ర కథా వస్తు వంతా ఆ ముందు చెప్పిన ఇప్పుడు చెప్పిన ఈ రెండు సూత్రాల మీదనే నడచిందంటే ఆశ్చర్యం లేదు.
Page 163