#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ధేనువును. ఉన్నట్టుండి అది ఒక సింహం ధాటికి గురి అయింది. దాన్ని విడిపించటానికి తన శరీర మాహుతి చేస్తా నంటాడు. చేస్తే తానిక ఉండబోడు. తానే లేకుంటే ఇక సంతాన మేమిటి. ఆ వ్రత దీక్ష ఏమిటి. ఎందు కిదంతా నిష్ప్రయోజనం కదా. అయితే ఎప్పుడా ప్రయోజనం కోర వలసింది. ధేనువును కాపాడితే. ధేనువును కాపాడటమా ముఖ్యం తనకు సంతాన ఫలమా. మొదట రాజు కుండ వలసినది కర్తవ్య పాలన తరువాతనే ఏదైనా అనే ఈ భావ మెంత ఉదాత్తం. మహా బ్రతికితే ఎన్నాళ్ళో బ్రతకం. బ్రతకటం కాదు బిడ్డలను కనటం కాదు. రాజ్య భోగాలను భవించటమూ వంశాన్ని నిలబెట్టటమూ కాదు. ఉన్నా పోయినా ఎప్పటికీ నిలిచి ఉండే శరీరం కావా లంటున్నాడా రాజు. అది భౌతికమా కాదు. అభౌతికమైన కీర్తి శరీరమట. అది కావాలను కొన్న వాడి కిక రాజ్యం లేదు. వంశం లేదు. సంతాన మంతకన్నా లేదు. దానికి దెబ్బ తగల నంత వరకే ఇది. అందులోనే ఉంది రఘు వంశ ప్రతిష్ఠ అంతా. యశసే విజిగీషూణా మనే మాట కిదంతా కవి చేస్తున్న వ్యాఖ్యానం.

  ఇలాంటిదే రఘువు జీవితంలో ఒకటి వస్తుంది. నతు సర్ప ఇవ త్వచం పునః - ప్రతిపేదే వ్యపవర్జితం శ్రియం అంటా డాయనను గూర్చి కాళిదాసు. అజుడు మరీ దేబిరిస్తుంటే ఒకటి రెండు రోజులు వన గమన మాపు కొన్నాడట ఆ రాజు. అంత మాత్రమే. తాను వదిలేసిన రాజ్య భోగాలను మాత్రం మరలా తిరిగి చూడలేదట. ఇది ఎలాటిదంటే ఒక సర్పం తన కుబుసను వదిలేసి మరలా దాని వంక చూడనట్టే నట. అసలా రఘువు రాజ్యం చేస్తున్నపుడు కూడా ధనార్థులకోసం తన సర్వస్వాన్నీ సమర్పించే త్యాగశీలుడు. కౌత్సుడే ప్రశంసిస్తాడు. ఆరణ్య కోపాత్త బలి ప్రరోహః -స్తంబేన నీవార ఇవావ శిష్టః. వన వాసులంతా ఒలుచుకొని పోతే ధాన్య మందరికీ పంచి పెట్టి కాడ మాత్రమే మిగిలి కనిపించే నీవారం లాగా ఉన్నాడట ఆ నీరజాప్తుని వారసుడు. ఏవి ఉదాత్త భావం. అలాంటి వదాన్యు డొకమారు

Page 158

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు