#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అలంకారాలతోనే కథా వస్తువును నడుపుతూ చివరకా అవతార పురుషుడు సాకేత వాసులందరికీ సరయూ నదినే వైకుంఠందాకా నిలిపిన ఒక నిశ్రేణికగా చేసి వెళ్ళిపోయా ఉంటాడు. అంతే కాదు. పోయిన తరువాత కూడా తన కీర్తి లోకంలో కలకాలం నిలపటానికా అన్నట్టు ఉత్తరాని కొకరినీ దక్షిణాని కొకరినీ భారతానికి జయ స్తంభాలుగా హనుమద్విభీషణులను నిలిపి పోయాడట. ఈ విధంగా ఎంతని వర్ణించ మంటారు. ఆయన వర్ణనను గూర్చి చెబుతూ పోతే అది మరలా ఒక పెద్ద వర్ణన అవుతుంది.

  ఏతావతా సారాంశ మేమంటే వర్ణనే కథ - కథే వర్ణన కాళిదాసుకు. రెండూ గంగా యమునల లాగా సంగమించి పోతాయి రచనలో. అలాంటపుడే అనౌచిత్య దోషం దొరలదు. దొరలక పోగా శుష్కంగా కాక సరసంగా సాగుతూ పోతుంది కథా వస్తువు. ఇది ఒక అద్భుతమైన రచనా రహస్యం. ఇంకా ఒకటుంది ఆయన వర్ణనలో చెప్పుకోవలసిన ఆంతర్యం. ఆయన తన రచనలో ఒకానొక భావం అక్కడక్కడా విసురుతూ పోతాడు. అది ఒక ఆగ్నేయాస్త్రం లాగా దూసుకుపోయి మొత్తమా కథా జగత్తు నంతటినీ జాజ్వల్యమానంగా వెలిగించి చూపుతుంది. కథా సారమంతా అద్దంలోలాగా మన కందులో సాక్షాత్కరిస్తుంది. అంతే కాదు. భావన చేసేకొద్దీ ఆ భావం మన జీవితాని కంతా సద్యః పరనిర్వృతి తోపాటు ఒక శాంతిని విశ్రాంతినీ ప్రసాదిస్తుంది. నెమరు వేసేకొద్దీ క్రొంగొత్త రుచులూరుతూ పోతుంది. ఇలాంటి వాయన రచన లన్నింటిలోనూ అక్కడో ఇక్కడో ఎదురవుతూనే ఉంటాయి. రఘువంశంలో దిలీపుడా సింహంతో అనే మాట వినండి. కిమప్య హింస్యః తవచే న్మతోహం యశశ్శరీరే భవమే దయాళుః ఏకాంత విధ్వంసీషు మద్విధానాం - పిండేష్వనాస్థాఖలు భౌతికేషు. నీకు నా శరీరాన్ని హింసించట మిష్టం లేక పోతే నా యశశ్శరీరంలో చూపు ఆ కరుణ. మా లాటి రాజన్యులకు భౌతికమైన ఈ పిండం మీద దృష్టి లేదు తెలుసా అని చాటుతాడు. ఎంత గొప్పమాట ఇది. అసలు సంతానం కోసమని సేవిస్తున్నాడా

Page 157

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు