సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పోతే ఇవన్నీ ఒక ఎత్తు. రామ కథ ఒక్కటీ ఒక ఎత్తు. మొత్తం వాల్మీకి రామాయణ మంతా ఐదు సర్గలలోకి దించి కుదించి విశ్వామిత్ర సృష్టిలాగా ఒక అపురూపమైన అతిలోకమైన కవితా సృష్టి ప్రదర్శించాడంటే నమ్మండి. అలా సృష్టించటంలో అది వర్ణనో తెలియదు- కథో తెలియదు. వర్ణనే ఒక పెద్ద ఐరావతం లాగా కథా రధాన్ని అప్రతిహతమైన వేగంతో గమ్యం వైపు లాగుకొంటూ పరుగెడుతుంది. దాని కిరువైపులా నిలిచి చూచే దేవతల లాంటి సహృదయ ప్రేక్షకుల కది ఒక మరపురాని మనోహరమైన నేత్రోత్సవం. సందేహంలేదు. నిర్విష్ట విషయ స్నేహః - దశరథుడు వృద్ధు డయ్యాడు. ప్రభాత దీపంలాగా విషయానుభవ స్నేహం ఇంకిపోయి జీవిత దశాంతం చేరాడట. తం కర్ణ మూల మాగత్య - పలిత కేశాలనే వ్యాజంతో తన చెవి దగ్గరికి వచ్చి కైకేయి వింటుందనే భయంతో జర రహస్యంగా చెప్పిందట రాజుకు రాముణ్ణి రాజు చేయమని. అది పౌరలోకాని కంతా వ్యాపించిందట ఆ చల్లని వార్త. ఎలాగో తెలుసా. దిద్ది తీర్చిన కాలువలోని నీరు ఉద్యాన వనంలోని ఆయా చెట్ల పాదులలోకి ప్రవహించినట్టు. మరి అది భంగమై రాము శరణ్యంలో ఎలా ప్రవేశించాడు. అరణ్యంతో పాటు అక్కడి తాపసుల హృదయంలో కూడా. భరతుడీ వార్త విని పట్టాభిషేకానికే గాదు తల్లికి కూడా ఎడ మొగం పెడమొగం పెట్టుకొన్నాడట. సీత రాముణ్ణి అనుసరించి ఎలా వెళ్ళింది అడవికి. కైక వద్దని అడ్డగించినా వినకుండా రాజ్య లక్ష్మి ఆయననే అనుసరించి వెళ్ళి నట్టుందట. వాలిని వధించి సుగ్రీవుణ్ణి ధాతువు స్థానంలో ఆదేశాన్ని నిలిపినట్టు నిలిపాడట రాముడు సీతను వెదకటానికి దశ దిశలకూ వెళ్ళిన వానరులు అటూ ఇటూ చెదరి పోయిన రాముడి ఆలోచనలా అనిపిస్తున్నారట. కుంభకర్ణుణ్ణి యుద్ధంలో వధిస్తే నీకీ ఆరు నెలల చిన్న నిద్ర ఏమిటి - శాశ్వతమైన పెద్ద నిద్రే పామ్మని చెప్పినట్టుందట. జటాయువును అంతకు ముందు రామ లక్ష్మణులు దర్శిస్తే అది సీతను రావణుడు అపహరించాడని నోటితో చెప్పి తాను చేసిన మహోపకారం శరీరం మీది గాయాలతోనే చెప్పి కన్నుమూసిందట. ఇలా అడుగడుగునా
Page 156