#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ఆ తరువాత కుల గురువు చేసిన ఆధ్యాత్మిక బోధ- ఏమిటీ వరస. ఒక సీను వెనుక ఒక సీను కనిపిస్తూ కనుమరుగు అవుతున్నట్టే భాసిస్తుంది. ఎక్క డికక్కడ నిలిచినట్టు కనిపిస్తూనే ఎక్కడా నిలవకుండా గమ్యాభిముఖంగా సాగిపోయే ఒక నదీ ప్రవాహం లాగా సాగుతూ పోతుంది మహాకవి రచనా ప్రవాహం.

  మరొక అద్భుతమైన రచనా రహస్య మేమంటే ఈయనలో కథా వస్తువూ వర్ణనా రెండూ ఒక దానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి కథే నడుస్తున్నదా వర్ణనే దాన్ని నడుపుతున్నదా ఏదైనదీ అర్థంకాదు. వర్ణన అనుకొంటే వర్ణన. కథ అనుకొంటే కథ. రెండింటి ప్రయోజనమూ ఒకే ప్రయత్నంతో నిర్వహిస్తాడు. ఇది ఒక అనన్యాదృశమైన రచనా శిల్పం. ఉదాహరణకు రఘువంశం లోని ఈ ఘట్టం చూడండి. రఘుర్బృశం వక్షసి తేన తాడితః - పపాత భూమౌ సహ సైనికాశ్రుభిః నిమేషమాత్రా దవధూ య చ వ్యథాం - సహోద్దితః సైనిక హర్ష నిస్వనైః. రఘు మహారాజుకూ దేవేంద్రుడికీ యజ్ఞాశ్వ నిమిత్తంగా దారుణమైన సంగ్రామం జరుగుతున్నది. దేవేంద్రు డాయన మీద కులిశం ప్రయోగించాడు. అది ఆయన వక్షస్థలం సోకింది. సోకగానే క్రింద పడిపోయాడు. ఒక్క నిమిష మలా సొమ్మసిల్లి వెంటనే మరలా పైకి లేచాడు. ఆ పడటమూ లేవటమూ ఎలా జరిగాయంటే తన సైనికుల దుఃఖా శ్రువులతో పాటు పడ్డాడట. వారి హర్షధ్వానాలతో పాటు పైకి లేచాడట. ఇక్కడ పడ్డాడనీ లేచాడనీ పడితే సైనికులు దుఃఖించారనీ లేస్తే మరలా వారు సంతోషించా రనేది కథా వస్తువు. ఆ వస్తువు జరిగితే జరిగినవి సైనికుల అశ్రుపాతమూ హర్షధ్వానమూ. కాని వాటితోపాటు ఇవీ జరిగాయని సహోక్తిగా వర్ణించటంలో వర్ణనా సౌందర్యమూ ఉంది. కథా గమనమూ కలిసి వస్తున్నది. ఇలాటి ఉభయ తారకమైన రచనకిది కొక మచ్చుతునక.

  తునకలేమి వచ్చె. కమ్మెచ్చులోనుంచి లాగిన ఒక బంగారు తీగనే చూడవచ్చు మన మోపిక ఉంటే. ఆ రఘువంశంలోనే కనపడతా యొక

Page 153

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు