సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
అకాలంగా కన్నుమూయటంతో. అప్పటికా ఆనందమంతా ఇలా అర్ధాంతరంగా ముగియటానికేనా అని తోచదా మనకు. ఆ మహారాజుకు దుఃఖోపశమనం చేయటానికి కులపురోహితుడైన వసిష్ఠు డెంతో వేదాంతోపదేశం చేస్తాడు. అదంతా విన్నట్టే కనిపిస్తాడా రాజు. కాని చివరకు మనో వ్యాధి ప్రబలమై గంగా సరయూ సంగమంలో దూకి ఎవరికీ తెలియ కుండా దేహత్యాగం చేస్తాడు. ఇలాగే కుమార సంభవంలో దేవేంద్రుడు మన్మధుణ్ణి స్మరించటమూ - అతని ప్రగల్భాలూ - అకాల వసంతో దయమూ ప్రేయసీ ప్రియుల కామోద్రేకమూ ఎంతగా వర్ణించాలో అంతగా వర్ణించాడు కవి. ఎందుకీ వర్ణన అంతా. ఇంత హడావుడీ ఒక్క సారి ఆ పరమేశ్వరుడి కంటి మంటలో దగ్ధమై పోవటానికే. మదనుడి అంత ఉత్సాహమూ మదన పత్ని రతి దీర్ఘ విలాపంలో అస్తమించటానికే. అని మౌనంగా జవాబిస్తాడు మనకు కవి. అలాగే పార్వతి ఎంతో హావ భావాలతో పరిచర్య చేస్తుంది పరమేశ్వరుణ్ణి. తన తండ్రి కోరికా తన కోరికా ఫలిస్తుందనే ఆశ పడుతుంది. ఎంతగా ఆశపడిందో చివరకంత నిరాశ ఎదురయిం దావిడకు. అది మరలా ఆశగా చిగిర్చి టాని కెంతో శ్రమపడి తపస్సు చేయవలసి వచ్చింది. అంత గంభీరంగా మొదట కనిపించిన ఆ ఈశ్వరుడు కడపట ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి ఎంతో చపలంగా మాట్లాడుతా డామెతో. ఆమె మరలా గాంభీర్యం వహించి పెద్దలు న్నారు వారి నొప్పించ మని కోరితే మరలా ఆయనే ఉండబట్టలేక ఎప్పుడెప్పుడా అని ఉబలాట పడతాడు.
ఏమిటీ డోలాయమాన వ్యవహారం. ఏమిటీ అటూ ఇటూ గాని వర్ణనలు. అటూ ఇటూ గాని దీలోక వృత్తమే. ఎప్పుడేది జరుగుతుందో చెప్పలేమీ లోకంలో. క్షణంలో సుఖం మరుక్షణంలో దుఃఖం. క్షణంలో ఉత్సాహం మరు క్షణంలో దైన్యం. ఇప్పుడొక కష్టం. దీని వెంటనే ఒక సుఖం. ఎప్పుడూ అనుకూలం లేదు. ఎప్పుడూ ప్రతికూలమూ తేదు. నీచైర్గచ్ఛ త్యుపరి చ దశా చక్ర నేమి క్రమేణ అని తానే వాక్రుచ్చాడు లోకానికి. సృష్టిలో
Page 151