సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
చేయ గలడే వర్ణన చేసినా. అది ఒక భావమే గాదు- వస్తువే గాదు - ప్రకృతి దృశ్యమే గాదు. ఇంకా ఇలా వర్ణిస్తూ పోతే ఎంత బాగుండును - ఇక్కడికే ముగించాడే అని అసంతృప్తి కలిగించేంత సంతృప్తి కరమైన వర్ణన లవి. అక్కడే ఉంది సంయమన మాయనలో. సంయమనంతో సౌందర్యం ద్విగుణీకృత మవుతుందని తెలిసిన కళా మర్మ కోవిదు డాయన.
ఇది తెలిసి మనం చదువుతూ పోయామంటే కాళిదాసు చాలా వరకు మనకు తెలిసిపోతాడు. ఒక ఎవరెస్టు లాగా కవితా గగనంలో ఎంతో ఎత్తు కెదిగి కనిపిస్తాడు. చేతనైతే నన్నందుకో చూతామని హెచ్చరిస్తాడు. ఇది మనకు నిదర్శనం కావాలంటే ఆ రచన ఈ రచన అని కాదు. ఏ రచన చూచినా అందులో పారసందు కాన రాదు. ఇంతెందుకు. రఘువంశ మహా కావ్యమే తీసుకొని చూడండి. దిలీపుడు సంతానం లేక దానికి నిమిత్త మేదో తెలుసుకోవాలని వసిష్ఠా శ్రమానికి వెడుతున్నాడు. అప్పుడా ప్రయాణం వర్ణిస్తున్నాడు కవి. శ్రేణీ బంధా ద్వితన్వద్భి: ఆకాశంలో బారులు తీరి ఎగిరి పోతున్నాయి బెగ్గురు పక్షులు. అవి ఇటూ అటూ స్తంభాలు లేని తోరణాల లాగా కనిపిస్తుంటే మెడ పైకెత్తి చూస్తున్నారట రాజ దంపతులు. క్రొత్తగా తీసి తెచ్చిన వెన్న ముద్ద లక్కడక్కడా గొల్ల వృద్ధులు కానుకలిస్తే పరిగ్రహిస్తూ దారి కిరుప్రక్కలా ఉండే చెట్ల పేర్లు వారినడిగి తెలుసు కొంటున్నారట. ఎంత సహజ సుందరమైన వర్ణనలు. ఇంకా ఏదో చెబుతున్నాడనే లోపలే మనల నాశ్రమ వాటికలోకి చేరుస్తాడు కవి. అంతకు ముందు అనుకూలమైన మారుతమూ ఎదట కనిపించే తోరణ మాలికలూ నవనీతోప హారాలూ- ఇవన్నీ వర్ణించటంలో ఆ రాజ దంపతులకు కలగబోయే శుభాన్ని కూడా సూచిస్తున్నాడు కవి. మరి అక్కడ ఆశ్రమంలో ప్రవేశించగానే అది ఎలా దర్శన మిచ్చిందా ఆశ్రమం. ఆతపాత్యయ సంక్షిప్త నీవారాసు నిషాదిభి:- అదృష్టాన్ని ప్రత్యుత్థానైః - సాయంకాలం ఎండ సెగ చల్లారితే - ఆరబోసిన ధాన్యమొక చోటికి తాపస కన్యలు పోగు చేస్తే- వాటిమీద
Page 148