సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కాదు. భావ వర్ణనే కాదు. ప్రకృతి వర్ణనే కాదు. సరి క్రొత్తగా ఉండాలి. సందర్భోచితంగా ఉండాలి. సముచితంగా ఉండాలి. ఆనంద వర్ధనుడు చెప్పినట్టు వర్ణించ గలిగిన శక్తి ఎంత ఉన్నా ఎంతో అంతే. చాపల్యం పనికి రాదు. అది కాళిదాసు కొకరు చెప్పబని లేదు. ఔచిత్య మాయనకు వెన్నతో బెట్టిన విద్య. ఎంత సౌందర్యా రాధకుడో అంత ఔచిత్య పరిపాలకుడు. అది ఇంత వరకూ జరిగిన ప్రస్తావన లోనే విశదమయింది మనకు. ఋతు సంహారంలో కథా వస్తువే లేదు. పేరుకు తగినట్టు షడృతువుల లోని అంద చందాలను వర్ణించే నెపంతో ఈ ప్రకృతి రామణీయకాన్ని కన్నులకు కట్టినట్టు ప్రదర్శించటమే రసజ్ఞుడైన కవి తాత్పర్యం. అదీ రామాయణ ప్రభావం బాగా మనసు మీద పని చేసి తదీయ ఋతు వర్ణనలతో పరవశించి చేసిన ప్రయత్నం. రామాయణంలో కథానుగుణంగా సాగిందా వర్ణన. అక్కడ అది ఔచిత్యం. పోతే ఇక్కడ కథ అనే ఊసు లేదు కాబట్టు విశృంఖలంగా సాగించాడు కవి. ఇది ఇక్కడి ఔచిత్యం. మరి అంతో ఇంతో కథ ఉంది మేఘ సందేశంలో. అదీ మీను మీసంలాగా లేశమాత్రమే. కనుక అక్కడక్కడా యక్షుడనీ మేఘుడనీ అలకానగరమనీ యక్షకాంత అనీ మాటలు వదలకుండానే ఆ ఉదంతాని కుద్దీపకంగా పది పాళ్ళు విరహ వృత్తాంతమైతే తొంబది పాళ్ళు విరహోద్దీపక మైన ప్రకృతి వర్ణన చేయ వలసి వచ్చింది మహా కవి. ఇదీ ఇందులోని ఔచిత్యం. కాగా విక్రమోర్వశీయ మలా కాదు. అది కథా వస్తువు చాలా ఉన్నది. అందులోనూ నాటకం. పిచ్చిగా వర్ణించరాదు కవి. ఔచిత్యం దెబ్బ తింటుంది. వస్త్వనుసారిగా సాగాలి వర్ణన. అలాగే సాగించాడు. నాయకుడికి అనుకోకుండా నాయికా వియోగ మేర్పడింది. ఇక ఆవిడ మరలా దర్శనమిచ్చే వరకూ కథ లేదు. ఆ అంతరాళంలో చేయవలసిం దేమిటిక. నాయకు డైతే ఆక్రందన. కవి నాయకుడైతే తదాగ్రంధన. అలాగే గ్రధనం చేశాడా నాయకుడి కామం ఫలించే వరకూ. కాబట్టి ఇదీ ఔచిత్యమే..
Page 146