సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
విక్రముడుగానీ- మేఘదూతంలో యక్షుడుగానీ- తమ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏది చూచినా వారికందులో అద్దంలో ముఖంలాగా తమ ప్రణయ చ్ఛాయలే గోచరిస్తాయి. గోచరించే కొద్దీ కామం పెచ్చు రేగుతుంది. అలా రేగే కొద్దీ ఆదృష్టి కది పిచ్చిగా మారుతుంది. ఆ పిచ్చిని వర్ణించాలనే రస పిచ్చికూడా కవి కంతకంతకూ హెచ్చిపోతుంది. అది ఆయన కవితా శిల్పానికే ఒక అనల్పమైన శోభ నావహిస్తుంది. ఇదీ ఈ రెండు కావ్యాలలో మహా కవి అందుకొన్న కళా శిఖరం. ఈ రెండింటిలో వస్తువే వర్ణన వర్ణనే వస్తువు. ఏదనుకొంటే అది. చూడండి. మేఘదూతంలోని ఈ శ్లోకం వింటే మీకే అరమవుతుంది. శ్యామాస్వంగం..... సాదృశ్య మస్తి ప్రియంగు లతలు మొదలుకొని నదీ తరంగాల వరకూ దేనిలో నైనా నీ అందచందాలకు పోలిక కనపడుతుందేమో తృప్తి పడదామంటే ఎందులోనూ కనపడ వేమి చేయాలని వాపోతాడు యక్షుడు. నిన్ను గాఢంగా కౌగిలించుకోవాలని ఆకాశంలోకి చేతులు చేస్తుంటే చుట్టూ నిలిచి చూచే చెట్లు తుషారాశ్రువులు రాలుస్తాయంటాడు. ఇది వర్ణనంటారా. కథ అంటారా. రెండూ ఓత ప్రోతంగా అల్లుకు పోలేదూ. మేఘదూత మంతా ఇదే వరస. అలాగే విక్రమోర్వశీయంలో విక్రముడు చివరకొక పర్వత గుహలోకి పోయి నాకాంత నీలోకి వచ్చిందా చూచావా అని అడిగితే అదే జవాబిస్తుందట అతనికా పర్వతం. మనం ధ్వని చేస్తే ప్రతి ధ్వనించటమే గదా గుహాలక్షణం. ఇంతే గాక ఇందులో గాంభీర్య మేమంటే ఒక కాముకుడి స్పందన ఎలా ఉంటే - బాహ్య ప్రకృతి కూడా అలాగే ప్రతి స్పందన చూపుతుందనే కళా సూత్రాన్ని వ్యంగ్యంగా చాటుతున్నాడు కవి.
ఇంతకూ సారాంశ మేమిటి. వర్ణన అనేది ఏదో చేశామంటే చేశామని గాదు. అది తాను వివక్షించిన కథా వస్తువుకూ దాని గమనానికీ దాని ప్రయోజనానికీ ఎలా దోహదం చేస్తుందో- ఎలా అతికి నట్టుండాలో అలా చేస్తేనే అది గొప్ప కళ. ఈ కళలో కాళిదాసుకు కాళిదాసే సాటి. అది వస్తువర్ణనే
Page 145