#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

వతస్థే. కవిత్వమంటే చిత్రం చూచినట్టు చూడ గలిగిందేదో అదేనని ఆయన హృదయం. కుమార సంభవంలో పరమేశ్వరుడి తపస్సమాధిని వర్ణించిన ఘట్టం చదువుతుంటే నిజంగా ఒక మహోజ్జ్వలమైన చిత్రాన్ని చూస్తున్నామా అని తోస్తుంది భావుకుడికి మన్మధుడు స్థాణ్వాశ్రమంలో ప్రవేశించాడో లేదో ఎదుట కనిపిస్తున్న దీశ్వరుడి విగ్రహం. ఎలా కనిపిస్తున్నదది. దేవదారు వృక్షం క్రింద ఒక వేదిక. దాని మీద శార్దూల చర్మం. దాని పైన ఆసీనుడయి ఉన్నాడాయన. ఎలా. రెండు పాదాలూ తొడలమీద వేసుకొని చేతులు రెండూ ఒడిలో వెల్లకిల పెట్టుకొని పొడవైన బాహువులు కదలకుడా నిలుపుకొని కూచున్నాడట. జడలన్నీ పాములచేత పెన వైచి కొప్పు పెట్టుకొన్నాడు. రెండు పేటలుగా రుద్రాక్షమాల చెవులకు చుట్టుకొన్నాడు. కృష్ణాజినం తన నల్లని మెడ చుట్టూ ముడి వేసుకొన్నాడు. స్తిమితో గ్రమైన కనుపాపల చూపులు నాసికాగ్రం మీదనే నిలిపి ఉంచాడు. మరి ఆయన అలా చూస్తుంటే కపాల రంధ్రం నుంచి యోగ ప్రభావంతో జ్యోతి: ప్రరోహాలు పైకి చిమ్ము తున్నాయి. లోపల ప్రాణాపానాది వాయువులను స్తంభింపజేసి నివాత ప్రదీపం లాగా- వృష్టి సంరంభం లేని మేఘ మండలం లాగా తరంగ భంగం లేని మహా సముద్రం లాగా - భాసిస్తున్నాడట ఆ మహా యోగీశ్వరుడు. ఈ వర్ణన చూస్తే ఏ గొప్ప చిత్రకారుడో గీచిన ఒక చిత్ర పటం లాగా స్ఫురించటం లేదా మనకు. అసలు రవి వర్మలాంటి చిత్రకారు లందరూ కాళిదాసు చేసిన ఈ వర్ణన చూచే తరువాత సమాధి గతుడైన ఈశ్వరుని చిత్రాన్ని అలా గీస్తూ వచ్చారా అని తోస్తుంది.

  అయ్యగారి బొమ్మ ఇలా గీచాడా మహా కవి. ఇక అమ్మగారి బొమ్మ గీచి చూపుతున్నాడు. అప్పుడే ఆశ్రమంలో ప్రవేశిస్తున్నదా మహా తల్లి. ఎలా ఉంది అప్పుడా దివ్య మంగళ విగ్రహం. అశోక నిర్బరిత పద్మరాగం-కెంపుల బదులు అశోక పుష్పాలు ధరించింది కొప్పులో. బంగారు వన్నె కొండగోగు పూవులు చెవులకు పెట్టుకొన్నది. సిందువార మాలలు ముత్యాల దండలుగా మెడలో వేసుకొన్నది. మొత్తంమీద వసంత పుష్పాలే నవాభరణాలుగా ధరించి

Page 138

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు