సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
లతా: ప్రసూనై :- ఆచార లాజై రివ పౌర కన్యా:- దిలీపుడు వనంలో ప్రవేశించాడో లేదో లతలనే కన్యలు పౌర కన్యలలాగే ఆయన మీద పుష్పాలనే అక్షతలు చల్లుతాయి. శాకుంతలంలో శకుంతలకు ప్రాణసమానమైన బిడ్డ ఒకటున్నది. అది ఏదో కాదు. వనమాలిక అనే లత. దానికి వనజ్యోత్స్న అని పేరు పెట్టిందావిడ. దాన్ని పెండ్లి కూతురుగా ముస్తాబుచేసి సహకార పాదపమనే పెండ్లి కొడుకుతో ఎప్పుడు కలపాలని ఆవిడ ఆలోచన. లతా పాదప మిథునమట అది. ఇలాటి మిథునాలు కొన్ని అకాల వసంతో దయానికి తట్టుకోలేక పోయాయి కుమార సంభవంలో. ముఖ్యంగా తరులనే వరులు తట్టుకోలేక పుష్ప స్తబకాలనే స్తనాలతో ప్రవాళాలనే అధరాలతో వచ్చి కౌగిలించుకొన్న లతా వధువులను తమ శాఖా బాహువులతో గట్టిగా హృదయాలకు హత్తుకొన్నాయట. ఇక మధుకర దంపతులైతే రెండూ కలిసి ఒకే కుసుమ పాత్రలో మధు పానం చేస్తున్నాయట. తాకితే పారవశ్యంతో కనులు మూత పడ్డ ఆడు జింకను మగ జింక కొమ్ములతో దాని శరీరాన్ని మెల్లగా గోకుతున్నదట. మరి ఏనుగు దంపతు లైతే మగ ఏనుగు పెంటి ఏనుగుకు పద్మరేణు పరిమళితమైన జలాన్ని పుక్కిటితో అందిస్తున్నదట. సగం కొరికిన మృణాళ నాళాన్ని చక్రవాకం చక్రవాకి నోటి కందిస్తున్నదట. ఏమి మనోహరమైన వర్ణనలివి. ప్రేమ రస బంధురమైన దాంపత్య జీవన సుఖాన్ని మానవుల నుంచి మోసుకొని పోయి స్థావర జంగమాల కన్నిటికీ పంచి పెడుతున్నాడు మహా కవి. అచేతన సృష్టి కూడా సచేతనమే ఆయనకు.
అంతేకాదు. అచేతనాలలో చేతన వ్యవహారాన్ని చూచినట్టే చేతనాలలో మరలా అచేతన భావాన్ని కూడా చూడగల డాయన. సర్వాతి సార యుక్తేన సర్వతేజోభి భావినా- స్థితస్సరోన్న తేనోర్వీం క్రాంత్వ మేరు రివాత్మనా. దిలీప మహారాజు మేరువులాగా భూమండల మాక్రమించి ఉన్నాడట. మేరువులాగే స్థైర్యమూ తేజస్సూ ఔన్నత్యమూ అన్ని గుణాలూ ఉన్నాయట
ఆయనకు. భీమకాంతై: నృప గుణై:.... యాదో రత్నై రివార్డ్లవ: సముద్రంలా
Page 136