#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ఇలాంటి వర్ణనలన్నీ చూస్తుంటే ఇవి పట్టణాలా ప్రాసాదాలా నదులా సముద్రాలా పర్వతాలా అనే ప్రశ్న లేదు. అచేతన సృష్టిలో కూడా చిద్రూపిణి అయిన ఆ మహాశక్తి సౌందర్యాన్నే తిలకిస్తుంటాడు మహా కవి. పర్వత పట్టణాదులే గాదు. ఆకాశంలో ఎక్కడో సంచరించే మేఘాలూ- ఆ మేఘాలలో తళుక్కున మెరిసే మెరుపుతీగలూ కూడా సచేతనాలే ఆయనకు. ఎంత దూరం పోయిందంటే ఈ ఊహ- విక్రమోర్వశీయంలో ఆపాతత: చేసిన వర్ణన చాలక మేఘ సందేశ మనే ఒక ఖండ కావ్య రచనకే అది పురికొల్పింది. యక్షుడు మాట్లాడిన దంతా ఆమేఘుడి తోనే. అతని దృష్టికా మేఘుడొక ఆపద్బాంధవుడు. గొప్ప రసికుడు. ప్రాణమిత్రుడు మహాభక్తుడు. ఇంకా ఎన్నో ఎన్నో. పుష్కరావర్త వంశంలో పుట్టాడా మేఘుడు. దేవేంద్రుడికి నమ్మిన బంటు. సంతప్తుల పాలిటికి చల్లని ప్రభువు. ఏటేటా వచ్చి తన పర్వత మిత్రుణ్ణి కలుసుకొని తన ప్రగాఢ మైత్రికి చిహ్నంగా ఆనంద బాష్పాలు కురుస్తాడు. నాట్యం చేసి చేసి అలసి పోయిన వార కాంతల కుచ కోరకాల మీద చల్లని చినుకులు రాల్చి అనురాగ పేశలమైన వారి అపాంగ వీక్షణాలకు పాత్రుడైన రసికుడు. మరి సారస్వత జలాలను పానం చేసి బాహ్యానికి కృష్ణ వర్ణుడైనా ఆంతర్యంలో పరిశుద్ధు డైన వాడు. ఆదిమ దంపతులు కైలాస మారోహిస్తుంటే ముందుగా పోయి వారికితన శరీరాన్నే సోపాన పంక్తిలాగా అలవరించే పరమ భాగవతుడు. పోతే ఇక విద్యుత్కళత్రాన్ని ఎడబాయక చిరకాలం కాపురం చేయాలనుకొనే సద్గృహస్థుడు. ఇలాంటి వాడు మేఘుడంటే కవి దృష్టికి.

  ఒక్క మేఘు డేమిటి- పర్వత పట్టణాదు లేమిటి. లతా వృక్ష పశు పక్ష్యాదులకు కూడా మానవోచితమైన వ్యవహారాన్నే అంటగడతాడా మహా కవి. అవి నదీ పర్వతాదుల లాగా అచేతనాలు కాకపోయినా మానవులు కావు కదా. అయినా వాటిని కూడా మానవులుగా భావించి వర్ణిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆహ్లాదం కొలుపుతుంది మన హృదయాలకు అవాకిరన్ బాల

Page 135

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు