#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

చూపుతాడు. అంతే కాదు. రాజ మాత్రుడు కూడా కాక దేవతాత్ముడని ఇంకా గొప్ప పదవి ఇస్తాడాయనకు. అలా కాకుంటే జగన్మాతకు జనకుడు కాలేడు. దేవర్షులతో వ్యవహరించలేడు. జగదీశ్వరుడికి శ్వశురు డనిపించుకోలేడు. ఇదంతా మనసులో ఉండే మొదటి నుంచీ చివర దాకా ఆయన చేతనాచేతన స్వరూపాన్ని సవ్యసాచి లాగా వర్ణిస్తూ వచ్చాడు కవి. వ్యపదేశాని కచేతన మైతే వ్యవహారానికి చేతనం.

  ఒక పర్వత మేమిటి. ఆ పర్వతం మీద ప్రవహించే గంగాది నదీమ తల్లులు కూడా సచేతనలే కవి దృష్టికి. పార్వతి లాగా భాగీరధి కూడా ఆయన కూతురే. తయాస పూతశ్చ విభూషితశ్చ. ఇద్దరి చేతా తన జన్మ పవిత్రమైనదని భావించినవాడు. ఆవిడను ఈశ్వరుడికిచ్చి సంతసించినట్టే ఈవిడను సముద్రుడి కర్పించి తృప్తి చెందిన సద్గృహస్థుడు. మరి గౌరికి గంగ అక్కగా రైనందుకు చెల్లెలిని చెట్టబట్టిన జగద్గురువు కావిడ సేవ చేయటం కూడా ధర్మమే. అందుకేనేమో శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంటే మూర్తేచ గంగా యమునే తదానీం సచామరే దేవ మసేవి షాతం. తానూ తన ప్రియ సఖి యమునా చక్కగా ముస్తాబు చేసుకొని వచ్చి చామర గ్రాహిణులయి ఆయనను సేవించారట. శ్రీ రాముడు వన వాసం ముగించు కొని తిరిగి సీతా సమేతుడయి అయోధ్యకు వస్తున్నాడు. పుష్పకంనుంచి క్రిందికి చూస్తే పురోప కంఠంలో సరయూనది కన్నుల పండువు చేసింది. దాన్ని వర్ణిస్తూ సీతతో ఇలా అంటా డాయన. సేయం మదీయా జననీవ తేన మాన్యేన రాజ్ఞా సరయూ ర్వియుక్తా- దూరే వసంతం శిశిరానిలై ర్మాం తరంగ హస్త్రైరుపగూహతీవ. ఇదుగో చూచావా సీతా ఈ సరయూ నది. ఇది నది కాదు. మాతల్లి కౌసల్యా దేవే. ఆవిడ లాగే మా తండ్రి నెడబాసి బ్రతుకుతున్నది. నాకోస మిన్నాళ్ళూ కంట తడి పెట్టి ఇప్పుడు నేను రాగానే దూరంనుంచే చల్లని తరంగ హస్తాలతో నన్ను గాఢంగా కౌగిలిస్తున్నది. ఎంత

Page 132

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు