సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మాటకర్థం. అసలు కంత అక్కర లేదు గాని దానిని చూచి తయారు చేసే నకలు కెక్కువ కావాలది. దీనికే ప్రతిభ అని మారుపేరు. ఇలాటి ప్రతిభా సంపత్తి నూటికి నూరుపాళ్ళూ ఉన్న సంపన్నుడు కాళిదాస మహా కవి. చేతనా చేతన పదార్థ జాతమీ సృష్టిలో ఎంత చిత్ర విచిత్రంగా మనోజ్ఞంగా కనిపిస్తుందో- అంత విలక్షణంగా హృదయంగమంగా కనిపించేలాగా నగిషీ చేసి చూపాడాయన తన కావ్య సృష్టిలో. అంతే కాదు. చైతన్య రూపుడైన ఒకే ఒక పరమాత్మ సృష్టి అయినప్పు డచేతన మైన భాగమిందులో కని పించరాదు. అంతా చైతన్య మయంగానే భాసించాలి. అందుకే నేమో అచేతనాలకు కూడా చైతన్యాన్ని ఆరోపించి వాటిని కూడా చేతనాలుగానే మనముందు నిలుపుతాడు మహాకవి. దానితో విశ్వమంతా ఒకే ఒక చైతన్య విభూతిగా సాక్షాత్కరిస్తుంది సహృదయుడి జ్ఞాన చక్షువుకు. ఆయన ఒక పర్వతాన్నే వర్ణించ నీయండి. పట్టణాన్నే వర్ణించ నీయండి. ఇదే వరస.
చూడండి. కుమార సంభవంలో హిమవత్పర్వతాన్ని వర్ణించాడు కవి. అది చేతనమా అచేతనమా అంటే రెండూ, రెండు రూపాలూ కనిపించాయా మహా కవికి. జంగమం ప్రేష్య భావే వః స్థావరం చరణాంకిత మంటూ హిమవంతుడి చేతనే పలికిస్తాడు సప్త మహర్షుల దగ్గర. సింహ వ్యాఘ్రాదు లక్కడ సంచరించటమూ గంగాది నదులు ప్రవహించటమూ - మేఘాలు సానువుల మీద వచ్చి వాలటమూ దేవదారు కీచకాదులు దట్టంగా పెరిగి కమ్ముకొని ఉండటమూ- దాని అచేతన లక్షణాలైతే- అనేక రత్న రాసుల కధిపతి అయి అప్సరసలకు విభ్రమాలంకారాలు సవదరిస్తూ గంధర్వ గానానికి తానం సమకూరుస్తూ - మహర్షులకు తపో భంగం లేకుండా ఆశ్రయమిస్తూ చమరీ మృగాల చేత వింజామరలు వేయించుకొంటూ - శత్రుభయంతో వచ్చి శరణు వేడిన చీకట్ల లాంటి క్షుద్రులకు కూడా నిలువ నీడనిస్తూ -ఇలాటివి దాని చేతన లక్షణాలు. అందులోనూ పర్వత రాజని వర్ణించి నందుకు రాజలాంఛనాలు కూడా ఏ మాత్రమూ బీరు పోకుండా వర్ణించి
Page 131