#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

మన మర్థం చేసుకోవలసిన కవి మాటల లోని మర్మం. ఈశ్వర సృష్టిలో సౌందర్యమున్నా అది చాలా వరకు గుప్తమై ఉంటుంది. అంచేత మానవుడి దృష్టికి కొంత సుందరం కొంత అసుందరంగా కనిపిస్తుంది. కవి అలా గుప్తమైన దాన్ని కూడా ప్రకటం చేసి సృష్టి అంతా సుందరమని మనకు జ్ఞాపకం చేయటానికే సర్వాంగ సుందరంగా తన కావ్య సృష్టి తీర్చి దిద్దుతాడు. ఈ ప్రతి బింబాన్ని బట్టి సహృదయుడు దీనికి బింబమైన జగత్సృష్టికూడా సర్వాంగ సుందరమే నని అర్థం చేసుకోవాలని కవి హృదయం.

  పోతే రచనా గతమైన ఆ సౌందర్యాన్ని కవి ఏలా పొందు పరిచాడో -తద్వారా పారమేశ్వరమైన ఈ జగ ద్రచనలోని సౌందర్యాన్ని భావకుడి దృష్టికెలా అందిస్తున్నాడో సోదాహరణంగా పరిశీలించ వలసి ఉంది. సిద్ధాంతానికి దృష్టాంతమే గదా పరిపూర్ణత నాపాదిస్తుంది. సిద్దాంత మేమిటి. రచన ఎంత సుందరమైతే అంతగా అది దాని మూల తత్త్వాన్ని మనసుకు తెస్తుందని. ఇది ఈ ప్రపంచ సృష్టి కెలాగో కావ్య సృష్టికీ అలాగేనని పేర్కొన్నాము. సృష్టి ఎలా జరిగిందసలు. చేతనా చేతనాత్మకంగా. లతా వృక్షాదులు మొదలుకొని మానవుల వరకూ ఆ మాటకు వస్తే దేవ దానవాదుల వరకూ - ఇదంతా చేతన సృష్టి. కాగా అరణ్య పర్వత నదీ సముద్ర పృధివ్యంతరిక్షాది భూత భౌతిక పదార్థజాత మంతా అచేతన సృష్టి. చేతనులంటే వారి చిత్తవృత్తులూ మాటలూ చేష్టలూ- ఈ త్రివిధ వ్యాపారాలూ కలిసి వస్తాయి. వాటిలో ఒక్కొక్కటీ ఏంతో విశాలమైన క్షేత్రం. చిత్ర విచిత్రమైన ఈ చేతన ప్రకృతినీ- అంతకన్నా చిత్రాతి చిత్రమైన జడ ప్రకృతినీ- ప్రత్యణువూ వ్యాపించి పరచుకొని ఉన్నదా పరాశక్తి రచనా సౌందర్యం. పోతే దాని ననుసరించే చేయవలసిన కావ్య ప్రపంచ సృష్టిలో కూడా అలాగే విస్తరించి ఉండాలది. అందులోనూ చాలా భాగం గుప్తమైన ఆ సృష్టి సౌందర్యాన్ని ప్రతి సృష్టిలో బాగా ప్రకటం చేసి చూపవలసిన భాధ్యత కూడా ఒకటున్నది మహా కవి పైన. అదే ప్రయత్నాత్ అని కాళిదాసు చెప్పిన

Page 130

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు