#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ద్రష్టగా ఆయన కిది నిజంగా ప్రయత్నమే. ఇక్కడ పార్వతీ దేవి- ఏకస్థం -సౌందర్యం - నిర్మాణం- ఇదంతా శివశక్తుల జగత్కావ్య నిర్మాణ రహస్యాన్నే మనకు వ్యంగ్య రూపంగా స్ఫురింప జేస్తున్నది.

  ఇంతే కాదు ఇంతకన్నా గొప్పగా అసలు మహా కవి మనకు కావ్య నిర్మాణ రహస్యాన్నే భంగ్యంతరంగా ధ్వనింప జేస్తున్నా డీ శ్లోకం ద్వారా. విశ్వసృ ట్టిక్కడ బ్రహ్మ కాదు. కవి బ్రహ్మే. ఆయన సృష్టించా లనుకొన్నా డొక కన్యను. అది గిరికన్య కాదు. కావ్య కన్య. లోకంలో ఉండే సౌందర్యమంతా ఉట్టి పడేలా తీర్చి దిద్దాలను కొన్నాడు. అందుకోసం తన ప్రతిభ నంతా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి కవితా సామగ్రినీ పోగు చేస్తాడు మహా కవి. అలా పోగు చేసిన సన్నివేశాలైతే నేమి పాత్రలయితే నేమి- రసభావా అయితేనేమి - ఏది ఎక్కడ వర్ణిస్తే అందంగా ఉంటుందో సముచితంగా ఉంటుందో బాగా సమీక్షించి నిర్మిస్తాడు కావ్యాన్ని. అయితే ఎందు కింత ప్రయత్నం - ఇంత సంరంభం కవికి. ఏకస్టమైన సౌందర్యాన్ని అనేకస్థం చేసి చూపి మరలా దాని నేకస్థంగా భావించటానికే . కవి ప్రతిభా శక్తిలో ఈ కావ్య సామగ్రీ కలాపమంతా ఏకస్థమయి ఉంటుంది. దానినే రచనా ముఖంగా ఆవిష్క రిస్తే అనేకస్థ మవుతుంది. అనేకస్థమయి కనిపించే ఈ సామగ్రి నంతా భావన చేస్తూ పోతే అది మరలా కవి వివక్షించిన కావ్యార్థం వైపు తీసుకొని పోయి ఏకష్టంగానే ఆ సౌందర్యాన్ని అనుభవానికి తెస్తుంది. ఇందులో ప్రతిభాగతమైన కావ్య సౌందర్యాన్ని బహుముఖంగా రచించి మనకు పంచి పెట్టటం కవి వంతయితే- బహుముఖంగా భాసించే ఆ సౌందర్య మంతటికీ గమ్యమా ఏకైకమైన కవి భావనే కాబట్టి దీని ద్వారా దాన్ని ఆకళించుకొని ఆనందించటం సహృదయుడి వంతు. కవిగా స్రష్ట - సహృదయుడుగా ద్రష్టా ఒక్కడే ఇక్కడ కూడా. స్రష్టగా నిర్మాణం చేస్తూ ద్రష్టగా నిర్వాణాన్ని పొందుతున్నాడు. దానికీ దీనికీ సంధాన సూత్రం సౌందర్యమే. కవి ప్రతిభా గతమైన సౌందర్యమే కావ్య రచనా రూపంగా బహిర్గతమై మరలా సహృదయుడి

Page 125

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు