#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

బయట పెట్టాడు చూడండి. కుమార సంభవంలో అమ్మవారి యౌవన సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నా డాయన. వర్ణిస్తూ వర్ణిస్తూ ఇలా అంటాడు చివరకు. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన - యథా ప్రదేశం వినివేశితేన- సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నా - దేకస్థ సౌందర్య దిదృక్ష యేవ. సృష్టి కర్త అయిన బ్రహ్మ పార్వతి అనే కన్య విగ్రహాన్ని సృష్టించ వలసి వచ్చింది. అలా సృష్టించేటపు డావిడ లోనే విశ్వ సౌందర్య మంతా పోగు చేసి ఒక్క చోట చూడాలను కొన్నాడట. అందుకోస మాయన సృష్టిలో ఉండే అలంకార సామగ్రినంతా సమకూర్చుకొన్నాడు. అందులో ఏది ఎక్కడ పంచి పెట్టాలో అక్కడే దాన్ని ప్రయత్న పూర్వకంగా పంచి పెట్టాడని వర్ణిస్తాడు కవి. పార్వతి అంటే ఆవిడ పరాశక్తే గదా. అలాంటప్పుడీ నామ రూపాత్మకమైన రచనా ఇందులోని సౌందర్య మంతా ఇక ఆవిడది గాక మరెవరిది. అయితే అది ఏకస్థం. ఏకమైన తత్త్వమా పరమాత్మే. ఆయన లోనే శక్తి రూపంగా గుప్తమయి ఉందా సౌందర్యం. గుప్తమయి ఉన్న ఆ సౌందర్యాన్నే ప్రకటం చేసి చూడాలను కొన్నాడు. ఎవడు. ఎవ డున్నాడిక. ఆ పరమాత్మే. విశ్వసృ ట్టాయన. ఏదయినా సృష్టించ గల శక్తి గలవాడు. కనుకనే ఏకస్థమైన ఆ అంతర్గత సౌందర్యాన్ని బహిర్గతంగా అనేకస్థం చేసి చూపాడు. అనేకస్థ మనే సరికి దేశ కాలాదులన్నీ వచ్చి పడతాయి. పడినా యధాప్రదేశం వినివేశితేన. అందులో ఏది ఎక్కడ ఉంచాలో అక్కడే దాన్ని ఉంచి సృష్టించాడు. అనేకథా విప్రకీర్ణ మయిన ఈ విశ్వ సౌందర్యాని కంతటికీ ఏమిటి ప్రయోజనం. దీన్ని మరలా విశ్వకర్త రూపంగా ఏకస్థం చేసుకొని దర్శించటమే. అప్పుడే ద్రష్ట అయిన సాధకుడి కది నిర్వాణ దాయకం. ఇందులో ఏకస్థమైన సౌందర్యాన్నే తాను అనేకస్థం చేయటం నిర్మాణ ప్రయత్న మయితే- అనేకష్టమైన దీన్ని మరలా ఏకస్థంగా భావించి చూడటం నిర్వాణ ప్రయత్నం. మొదటి భూమిక లో ఆయన స్రష్ట అయిన పరమాత్మ. రెండవ భూమికలో ఆయనే ద్రష్ట అయిన జీవాత్మ. రెండిటికీ ప్రయత్న మనేది ఆవశ్యకం. సర్వజ్ఞుడు గనుక స్రష్టగా ఆయన కది ప్రయత్నం కాని ప్రయత్న మయితే అల్పజ్ఞుడు గనుక

Page 124

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు