సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మయితే తద్గతమైన ప్రతిభ శక్తి స్వరూపం. యధాస్మై రోచతే విశ్వం- తధేదం పరివర్తతే అని గదా పేర్కొన్నాము. కవి దృష్టి ననుసరించి ఆయన ప్రతిభా శక్తి కూడా నామ రూపాత్మక మయిన ఒక ప్రపంచాన్ని రచించి సహృదయుడికి ప్రదర్శిస్తుంది . అక్కడ జీవుడైతే ప్రేక్షకు డిక్కడ సహృదయుడు. కాని ఊరక నిర్జీవంగా ప్రదర్శిస్తే సుఖం లేదు మరలా. జీవుడి దృష్టి లాగే భావుకుడి దృష్టి కవి ఆసించిన కావ్యార్థం వైపు మళ్లదు. మళ్ళి దాన్ని ఆకళించుకో లేదు. అలాంటి ఆకళింపు రావాలంటే బలంగా అతని భావనకు ప్రేరకమైన సౌందర్య మెంతగానో పొందుపడి ఉండాలి కావ్య రచనలో. సౌందర్యం భావనా ప్రేరక మయితే అది భావిత మయ్యేకొద్దీ కావ్యార్ధ స్ఫోరకమై తన్మయీ భావ మనే మహాఫలం సిద్ధిస్తుంది. అదే గదా శివమని ముందు పేర్కొన్నాము. కనుక రచనలో సౌందర్య మనేది అవశ్యం భావి. సృష్టికీ- సాహిత్య సృష్టికీ కూడా. సత్య శివాలనే రెండు తీరాలకూ నిర్మించిన గొప్ప వంతెన ఇది. రెండు కొసలనూ సోకుతూ రెంటినీ కలిపి ముడివేసే సంధాన కరణి సౌందర్యం. ఇది ఈ భౌతిక సృష్టిలో సహజంగానే చోటు చేసుకొని ఉంది. సార్వత్రికంగా ఉంది. ఏదీ కాదని త్రోసి పుచ్చటానికి లేదు. అవునని మెచ్చటానికి లేదు. తృణం మొదలు ప్రతి ఒక్కటీ దేని స్థానంలో అది ఉండ వలసిందే. అలా ఉంటేనే అది అందం. చందం.
మరి ఇదే కవి చేసిన కావ్య సృష్టిలో నైతే ప్రయత్న సాధ్యం. కావ్య సృష్టి అంటేనే కృత్రిమం గనుక ప్రయత్నం కూడా కృత్రిమంగా సాగవలసిందే. తప్పదు. అయితే కృత్రిమంగా చేసినా కృత్రిమమని ఏ మాత్రమూ అనిపించ రాదు. సృష్టి ఎంత నిసర్గ సుందరమో అంత నిసర్గ సుందరంగానే దిద్ది చూపగల డొక మహాకవి. కాగా మహా కవులలో మహాకవి గదా కాళిదాసంటే. ఆయన ఈ కళా సృష్టి రహస్యాన్ని ఎంతగా గ్రహించాలో అంతగా గ్రహించిన వాడు. మహా కవే గాక మహా విమర్శకుడు కూడా నని గదా వర్ణించా మాయనను. అన్యాపదేశంగా తన కావ్యాల్లో నాటకాల్లో ఈ నిర్మాణ రహస్యాన్ని అమోఘంగా
Page 123