రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
అధీన మైనట్టే అయింది గాని అది అతనికి దక్కలేదు. కారణ మతడు దుష్యంతుడు. సుష్యంతుడు కాడు. అవిద్యా కామ దూషితాంతః కరణుడు దుష్యంతుడు గాక సుష్యంతుడెలా అవుతాడు. నావిరతో దుశ్చరితాత్- ప్రజ్ఞానే నైన మాప్నుయాత్ అని కఠోపనిషత్తు వాక్రుచ్చినట్టు దుశ్చరితాదులకు దూరమైన పరిశుద్ధ జ్ఞానంతోనే పట్టుకోవాలి దాన్ని మానవుడు. అది ఇక్కడ జరగ లేదు. అందువల్లనే ఆ శక్తి తనదే అయినా ఒక శకుంతం లాగానే దూరంగా ఏ స్వర్గ సీమలకో ఎగిరి పోయింది. దాన్ని మరలా పొందే ఉపాయమే లేకుండా పోయింది. అయితే లేదా అంటే బొత్తిగా లేకపోదు. ఉంటుంది. ఈ సృష్టిలోనే దాగి ఉంది. ఎటు వచ్చీ దాన్ని చూచే దృష్టి ఉండాలి మనకు. అది కలిగే వరకూ మనకు కనపడేది దాని ఛాయా చిత్రమే గాని అది గాదు. ఛాయా చిత్రమీ ప్రపంచమే. ఇది శక్తి తాలూకు అచేతన మైన చిత్రమే గాని చేతన అయిన శక్తి కాదు. కనుకనే చేయి జారిపోయిన శకుంతల దూరమై ఆవిడ చిత్రపట దర్శనం తో తృప్తి పడుతూ వచ్చాడు దుష్యంతుడు. పోతే ఈ ప్రతి బింబానికి బింబ భూతమైన ఆ చిచ్ఛక్తిని దర్శించే దెప్పుడు సాధకుడు. తన రాజసత్వానికీ దానికి మూలమైన తన కామ గుణానికీ స్వస్తి చెప్పి సాత్త్వికుడని పించుకొన్నప్పుడు. పంచమాంకంలో జరిగిన సందర్భమదే. ఎంత అయాచితంగా తనకు శకుంతల దక్కినా మనసా కూడా కాంక్షించ లేదావిడను. కణ్వ శిష్యులెంత ప్రాధేయ పడ్డా పరిగ్రహించ టానికి పాలు పడలేదు. అంతకు ముందు గురుజనాన్హుజ్ఞ లేకుండానే సొంతం చేసుకోవాలని తహ తహ లాడిన వాడు. అవినయం రక్ష అని హెచ్చరించినా అవినీతిగా నడచిన వాడు. పైగా వయం తత్త్వాన్వేషా న్మధు కర హతాః - త్వం ఖలు కృతీ. మేము తత్త్వ విచారంతో పోగొట్టకొన్న అవకాశం నీవు సులభంగా కొట్టేశావని మధుకరా మంత్రణ వ్యాజంతో పరమార్థ దృష్టి కన్నా స్వార్థ దృష్టికే పట్టం కట్టిన వాడు. ఇప్పుడు కణ్వ శిష్యుల దగ్గరి నుంచి సర్వులూ అనుజ్ఞ ఇచ్చినా మధుకరం లాగా ఆవిడ యౌవన మధువు నాస్వాదించే అవకాశమబ్బినా తత్త్వాన్వేషణ దృష్టితో కాదని
Page 116