#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

మహా కవి. ఇతి హాసానికి నాటకీయ మైన బురఖా తొడిగి చూపాడు లోకానికి. శకుంతల ఎవరో గాదు. సీతా దేవే. సీతను కన్న తలిదండ్రు లెవరో తెలియదు. దేవ యజన సంభవ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో జనకుని ఇల్లు చేరింది. ఆ రాజర్షి కన్న బిడ్డ లాగే అభిమానించి పెంచాడు. అలాగే మేనకా విశ్వామిత్రు లిద్దరి చేతా పరిత్యక్త అయిన శకుంతలను కూడా కన్న కూతురి లాగే అభిమానించి పోషించాడు బ్రహ్మర్షి అయినకణ్వుడు. జనకుడు రాజర్షి అయితే ఈయన బ్రహ్మర్షి. ఇద్దరూ నిర్లిప్తులే. ఆయన పోషణలో ఉన్న ఆ కన్యను ధనుర్భంగం చేసి రాముడు పరిగ్రహిస్తే ఈయన పరోక్షంలో ఈ కన్యను ధనుర్వ్యాపార భంగం చేసి దుష్యంతుడు స్వీకరించాడు. ఆయన కన్యను సమర్పించి ఆ తరువాత ఆవిడ ఏమి కష్టాల పాలయిందో ఆ ఊసే పట్టించుకోలేదు. ఈయనా శకుంతల నత్తవారింటికి పంపి ఇక ఆ ప్రసంగమే మనసుకు రానీయ లేదు. కాగా అటు జానకీ ఇటు శకుంతలా గర్భవతులుగా ఉండి భర్త చేత పరిత్యజింప బడిన వారే. ఇద్దరూ నిజానికి నిరపరాధినులే. పరిత్యజించిన భర్త లిద్దరూ లోకాపవాదానికి వెరచి చేసిన వారే ఆ పని. ఒకరిది శాప వ్యాజం. మరొకరిది కోప వ్యాజం. అలాటి దీన స్థితిలో వారి నాదుకొన్న దక్కడా తల్లే. ఇక్కడా తల్లే. భూదేవి సీత నాదుకొంటే మేనకే శకుంతలను దగ్గర చేర్చు కొన్నది. అంతే కాదు. చివర కక్కడ సీత తండ్రి లాంటి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చేరితే ఇక్కడ కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తల దాచుకొన్నది శకుంతల. వాల్మీకి వల్లనే కుశలవులు తన బిడ్డలని - వారిని గన్న తల్లి సీత అక్కడే ఉన్నదని - గుర్తించ గలిగాడు రాము డక్కడ. ఇక్కడ కూడా కశ్యప ప్రజాపతి వల్లనే తన కూమారుడు భరతుణ్ణి తద్వారా ధర్మ పత్ని శకుంతలనూ - కలుసుకో గలిగాడు దుష్యంతుడు. అంతేగాదు. సీతా రాములు భూలోకంలో విడిపోయి కడకు వైకుంఠంలో శాశ్వతంగా కలుసుకొన్నట్టే శకుంతలా దుష్యంతులు కూడా భూలోకంలో పరస్పరం దూరమై పోయి తుదకు స్వర్గంలోనే ఎడబాటు లేని సమాగమ సుఖాన్ని పొందగలిగారు. ఇలా లోతుకు దిగి భావన చేసే కొద్దీ బయలు పడతాయి

Page 114

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు