#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

పోనీ విదూషకు డున్నాడు బయట పెట్టవచ్చు గదా అనుకొంటే వాడప్పుడక్కడ లేడు. ఆ తరువాత వచ్చినా పరిహాస విజల్పిత మన్నాడు గదా వయస్యుడు దాన్ని పరమార్థంగా ఎందుకు తీసుకోవాలని మౌనం వహించాడా చాదస్తుడు. మరి ఇది ఎలా గడ్డకు రావాలి. ఎవరు తేవాలి. ఒక్క అంగుళీయకమే. అదే అభిజ్ఞానం. అభిజ్ఞాన మైతేనే అది మోచకం. అనభిజ్ఞాన మైతే బంధకమే. దాన్ని నిష్కారణంగా దూరం చేసుకొని చివరకదే వారికి బంధకమై కూచుంది. అభిజ్ఞానమైన తరువాతనే ఇరువురూ కలుసుకొని బంధమోచకం కాగలిగింది. అది కూడా తెలియని దశలో ఉన్నారు వారిరువురూ. ఏమిటిది ఎందుకిలా జరిగిందని అడిగితే ప్రజాపతే వారికి జ్ఞానోదయం కలిగించాడు. మరి కణ్వుడికి తెలియదా ఈ రహస్యమని అడిగితే ఆయన కంతా తెలుసు తెలుసు గనుకనే విధి బలీయమని చెప్పి ఇంత కాలం మౌనం వహించాడని తెలుపు తాడు. దుష్యంతుడు కూడా అది విని అందుకే నేమో మహర్షి అప్పుడు తన మీద ఆ గ్రహించ లేదని సమాధానం చెప్పుకొంటాడు. ఇదంతా ఇలా జరుగుతుందని మొదటి నుంచీ ఆయా పాత్రల నోట పలికిస్తూనే వస్తాడు కవి. ఇష్ట ప్రవాస జనితాని సుదుస్సహాని - అనే కణ్వ శిష్యుడి మాటల్లో - భాగ్యాయత్త మతః పరం నఖలు తద్వాచ్యం వధూ బంధుభిః అనే కణ్వుని మాటల్లో ధ్వనిస్తూనే ఉందీ భవితవ్యత. ఋషీణాం పున రాధ్యానాం వాచ మర్థాను ధావతి అని గదా అభియుక్తోక్తి. దాని కపవాద మేముంది. కణ్వుని కంతా తెలుసు. తెలిసే చెడ్డ జరిగినా చివరకు మంచే జరుగుతుందని ఊరక చూస్తూ కూచున్నాడు. శాంతే కరిష్యసి పునః పద మా శ్రమే స్మిన్. భోగ భాగ్యాలన్నీ అను భవించిన తరువాత మరలా ఆశ్రమం లోనే అడుగు పెడతావు నీ భర్తతో సహా అని కుమార్తెను దీవించి పంపుతాడు. ఆయన నోటివాక్యం ఫలించి ఆవిడ మరలా కశ్యపాశ్రమంలో భర్తతో సహా ప్రజా పతి దర్శనం చేయ గలిగింది.

  ఇంతకూ వాల్మీకి మహర్షి ఆవేశించాడని పిస్తుందీ నాటక రచనలో కాళిదాసును. రామాయణ కథనే వేరొక నేపథ్యంలో మనకు ప్రదర్శించాడు

Page 113

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు