రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మాటలే చాటుతాయి. అసలు కణ్వడీ నాటకంలో మొదటి మూడంకాలలో కనిపించడు. చివరి మూడంకాలలో కనిపించడు. ఒక్క చతుర్ధాంకంలోనే దర్శన మిస్తాడు. తళుక్కున మెరిసి తటుక్కున మాయమవుతాడు. కాని ఆయన కనిపించక పోయినా మొదటి నుంచీ చివర దాకా ఆయనను గూర్చి మనకు వినిపిస్తూనే ఉంటుంది. మరి కశ్యపు డైతే సప్తమాంకంలోనే కనిపించి సప్తమాంకంలోనే అదృశ్యమవుతాడు. ఇంత అంటీ ముట్టని జీవితాలు వారివి. అలాటి నిర్లిప్తమైన జీవితమే ఆదర్శ జీవితమని కవి మనకిచ్చే సలహా
ఇంకొక గొప్పమాట. సిద్ధి వారికి సహజమైతే మనబోటి మానవులకది ప్రయత్న సాధ్యం. మనబోటి సామాన్యులకు ప్రతినిధి దుష్యంతుడు. గుణవంతుడే. కాని ఒక చాపల్యానికి గురి అయ్యాడు. ఆశ్రమంలో భిన్న సారంగ యూధమైన మదగజం కాదు చొరబడింది. మదోన్మత్తుడయి భిన్నమర్యాదుడైన దుష్యంతుడు. సుష్యంతుడు కాడు దుష్యంతుడు. దూరంగా చేతి కందకుండా ఎగిరిపోయే శకుంతాన్ని చేతికి చిక్కించుకోవాలని చూచాడు. చిక్కించుకొన్నాడు చిక్కింది కదా పరవా లేదనుకొన్నాడు. కానీ అది కణ్వుడు గాదు. దైవమే మెచ్చలేదు. వచ్చింది దుర్వాసుడి రూపంగా. ఇచ్చింది ఘోరమైన శాపం. అనుగ్రహించినట్టే అనుగ్రహించిందొక లంగుళీయకం. కాని అది కూడా దక్కకుండా మధ్యలోనే జారి పోయింది. కామ పరవశు లయిన ఇరువురినీ పరితాపానికి గురి చేసింది. ఒకరిని నేలమీద ఒకరిని నింగిమీద దూరంగా విసరి వేసింది. పశ్చాత్తాపంతో పరిశుద్ధులను చేసింది. తప్పు గ్రహించి సరి దిద్దు కొనేలా చూచింది. పరిశుద్దులయినా రని నమ్మకం కలిగిన తరువాత మరలా కలిపింది. చూడండి తమాషా ఇక్కడ. దుర్వాసుడు శాపం ఇచ్చింది వారికే అయినా శకుంతలకూ తెలియదు. దుష్యంతుడికీ తెలియదు. దానితో ప్రమేయమే లేని అనసూయా ప్రియం వదలకే తెలుసునది. అయినా వారు శకుంతలతో పోలేదు చేయలేదు. కాబట్టి ఆస్థానంలో అంత గొడవ జరుగుతున్నా ఈ రహస్యం బయట పడలేదు.
Page 112