#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  రచన అంటే నాటక రచన ఇది. కావ్య రచన కూడా కాదు. కావ్య రచన లోనే నూటికి నూరు మార్కులైతే నాటక రచనలో దానికి రెండు రెట్ల మార్కులు వేయ వలసి వస్తుందా కళాకారుడికి మనం. ఆశ్రమ రంగంతో ప్రారంభించి మరలా ఆశ్రమ రంగంతోనే ముగించట మెంత నాటకీయత. మొదట నివృత్తులమే మనం. చివరకూ నివృత్తులమే కావలసి ఉంది. మధ్యలోనే ఈ సంసార ప్రవృత్తి అని మనకు సూచన చేయటమే గదా ఇది. అంతే కాదు. నివృత్తిలో ప్రవృత్తి తెచ్చి పెడితే- మరలా ఆ ప్రవృత్తి నివృత్తిలో పర్యవసించే దాకా ఫలసిద్ధి లేదని కూడా సూచనే. అంతే కాదు. ధర్మ విరుద్దమైన కామ మెంత చెడ్డదో తదవిరుద్ధ మైన కామ మంత వాంఛనీయ మని చెప్పటానికి మొదటి దాని విజృంభణకు నడుమనే ఆన కట్ట వేసి పరాజయం పాలు చేశాడు కవి. రెండవ దానికి మొదట మొదట విబృంభణ లేక పోయినా కడపట దానికే విజయం చేకూర్చి పట్టాభిషేకం చేశాడు. అంతే కాదు. నిష్కాములూ నిరాడంబరులూ అయిన మహా పురుషుల జీవితానికీ సకాములూ సాడంబరులయి సకల ప్రాపంచిక వ్యాసంగాలతో సతమత మయ్యే సామాన్య మానవుల జీవితానికీ - ఉన్న పర్వత సర్షపోపమ మైన తారతమ్యాన్ని కండ్లకు కట్టినట్టుగా చూపి సాధన మార్గమెంత చక్కగానో నిరూపించాడు మహా కవి. ఆశ్రమ వాతావరణం మొదటి దానికి ప్రతీక అయితే - పట్టణ వాతావరణం రెండవ దానికి ప్రతీకగా భావించి సృష్టించాడు నాటకంలో. రెండింటి కున్న ఈ విభేదాన్ని శారరవాది ఋషికుమారుల మాటలలో ఘాటుగా అక్కడక్కడ చాటుతూనే వచ్చాడు. పరాతి సంధానం - కైతవ జీవితం - మీబోటి నగర వాసులకే గాని శాంతమైన ఆశ్రమ వాతావరణంలో పెరిగిన మాబోటి వారికది ఏకోశాన లేదని శిష్యులే గాక శకుంతలా గౌతములు కూడా మందలిస్తారా రాజును. లంచగొండులయి బ్రతికే రాజ సేవకుల దగ్గరి నుంచి జ్ఞానవైరాగ్యాల పరసీమ నందుకొన్న కణ్వ కశ్యపాది మహర్షుల వరకూ భిన్న విభిన్నమైన పాత్రలను చిత్రించిన మహా కవి భావన ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రసరించిందో చెప్పనలవి గాదు. కణ్వ కశ్యపులెంత సంయములో వారి ఆలోచనలూ వారి

Page 111

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు