రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
సాగనంపుతూ. అది దుష్యంతుడికీ విదితమే. మరి అలాటి రాజ లక్షణ లక్షితుడైన పుత్రుణ్ణి వెంట బెట్టుకొని శకుంతల ఆస్థానంలో ప్రవేశిస్తే ఇక సమస్య ఏముంది. శకుంతల నెలా కాదన గలడు దుష్యంతుడు. అంటే ఎలా చెల్లుతుంది. నాటకంలో సమస్య లేదు. పరిష్కారం లేదు. పంచమాంకంతోనే కథ పరిసమాప్త మయ్యేది. అందుకే తానూ వదిలేసి కణ్వ శిష్యులూ వదిలేసి అసహాయ అయిన శకుంతల నెలా ఆదుకోవాలో దిక్కు తోచక దుష్యంతు డాలో చిస్తుంటే రాజ పురోహితు డిలా సలహా ఇస్తాడు. ప్రసూతి సమయం దాకా ఈవిడ మా ఇంట్లో ఉంటుంది. ప్రసూతుడైన కుర్రవాడు చక్రవర్తి లక్షణాలు కలవాడైతే మీరు సందేహించక ఈవిడను పరిగ్రహించండి. అలా కాని పక్షంలో అప్పుడే ఈవిడను తండ్రి గారింటికి పంపవచ్చు మనమని చెబుతాడు. ఇంత ఉంది వ్యవహార మిందులో. అందుకనే భరతుని పుట్టుక ముందు జరపక కట్ట కడపటికి వాయిదా వేశాడు మహాకవి. అప్పుడిక తెలిసినా పరవా లేదు. మరి నాలుగవ ముఖ్యమైన మార్పు భువి నుంచి దివికి రంగ స్థలాన్ని మార్చటం. ఇది మరీ అద్భుతం. ఆశ్రమంలో కలుసుకొన్నారు నాయికా నాయకులు మొదట. ఆశ్రమంలోనే కలుసుకో వలసి వచ్చింది కడపట. ఆశ్రమంతో మొదలయి ఆశ్రమంతో ముగిసి పోయింది నాటక వృత్తం. ఒక ఆశ్రమం భూమి మీద నైతే మరొక ఆశ్రమం స్వర్గంలో. అంతే తేడా.. ఇది కణ్వాశ్రమం. అది మరీచాశ్రమం. ఇద్దరూ కన్న తండ్రులు కాకున్నా తండ్రి లాంటి వారే శకుంతలకు. కన్న తండ్రి విశ్వామిత్రు డొక మహర్షే గదా. ఆయన విశ్వానికే మిత్రుడు. ఆయనకీ మహర్షులిద్దరూ మిత్రులు కాకపోతారా. కనుకనే తండ్రి వదిలేసిన బిడ్డనొక రాదుకొంటే - భర్త వదిలేసిన ఆ బిడ్డనే మరొక రాదుకొన్నారు. ఇద్దరూ ఆశ్రమాధిపతులు. కనుకనే ఆ పని చేయ గలిగారు. ఆశ్రమ: శ్రమ నాశనః అన్నాడు వాల్మీకి. శ్రమను పోగొట్టేదే ఆశ్రమం. జీవితంలో ఏర్పడిన శ్రమను జీవులకు తొలగించేదని అర్ధం. శకుంతల చూడండి. కణ్వాశ్రమంలో ఉన్నంత వరకూ శ్రమ ఎరుగదు. మరలా కశ్యపా శ్రమం చేరిన తరువాతా ఎరుగదు. మధ్యలోనే ఆవిడ పడ్డ శ్రమ అంతా.
Page 108