#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

పించుకోవటం కన్నా పాపంలేదు. అది లోకాని కెలాటి అదర్శమూ కాదు. యధా రాజా తథా ప్రజా. రాజును బట్టే కదా ప్రజలు. రాజు ప్రవర్తనే నీచమయి నప్పుడు ప్రజలింకా నీచాతి నీచు లయినా తప్పులేదు. అంతే కాదు. అతని పుత్రుడే భరతుడు. అతడు షట్చక్రవర్తులలో ఒకడు. భరత వర్ష మనే పేరు మనదేశానికి జడ భరతుని వల్లనని భాగవతం చెప్పినా భారత ధోరణిని బట్టి చూస్తే ఈ భరతుడి వల్లనే ఏర్పడినా ఏర్పడి ఉండవచ్చు. అలాటి భారత దేశ ప్రభువును గన్న తండ్రే ఇలాటి దగులు బాజి అయితే ఇక భారతీయు లయిన మనబోటి వారికది ఏమి మర్యాద. కనుకనే ఒక భారతీయ మహా కవిగా కాళిదాసు దీనిని భరించ లేక పోయాడు. అతణ్ణి కళంకితుడుగా గాక నిష్కళంకుడుగా మనముందు నిలప దలచాడు. అందుకే మధ్యలో ఈ శాప వృత్తాంతం కల్పించి అతడి ఉదాత్తతను కాపాడాడు. అంగుళీయక ప్రసంగం కూడా ఇలాంటిదే. నాటకాని కంతా జీవ గర్ర ఇది. అది కోల్పోవటం వల్లనే అభిజ్ఞానం లేకుండా పోయింది రాజుకు. మరలా అది ఆ జాలరి పుణ్యమా అని చేతికి రావటం వల్లనే శకుంతలా గతమైన ప్రత్యభిజ్ఞాన మేర్ప డిం దతనికి. నిష్కారణంగా తన్ను వదిలేశాడని శకుంతలా నిష్కారణంగానే ఆవిడను నిరాకరించానని దుష్యంతుడూ - ఇరువురూ పశ్చాత్తాపంతో కుమిలి పోవటానికీ అంగుళీయకమే ఆధార మయింది. అది పోగొట్టు కొని ఆవిడ రాబట్టుకొని ఈయన. మొత్తం మీద దుర్వాసుడి శాపమే దీని వెనకాల ఉన్న అసలు కారణమని ఇరువురికీ తెలియదు. చివరకు కశ్యప ప్రజాపతి తెలిపే దాకా తెలియదా రహస్యం. నాయికా నాయకుల వియోగానికీ యోగానికీ రెండింటికీ ఆస్పదమిది.

  పోతే భరతుడు జన్మించక ముందే గర్భవతిగానే శకుంతల నగర ప్రవేశం చేయటంలో కూడా ఎంతో ఉంది ఆంతర్యం. కుర్రవాడు జన్మించాడంటే స్వారస్యం తప్పుతుంది. ఎందుకంటే ఆవిడకు చక్రవర్తి లక్షణోపేతు దైన పుత్రుడు జన్మిస్తాడని ఆశ్రమ వాసులైన వైఖానసుల దీవన. దాని కుపోద్బలకం గానే ఆశ్రమాధిపతి కణ్వ మహర్షి కూడా దీవిస్తాడు కుమార్తె నత్తవారింటికి

Page 107

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు